
ధావన్ ఔటైన తీరుపై సందేహాలు
ముఖ్యంగా షార్ట్ బంతులను పుల్ చేయబోయి అవుటైన ధావన్ విదేశీ గడ్డపై తన సామర్థ్యంపట్ల అటు అభిమానులతో పాటు క్రీడా విశ్లేషకుల్లో సందేహాలు రేకెత్తించాడు. తొలి ఇన్నింగ్స్లోనే పొరపాటున జరిగిందని అనుకుంటే, రెండో ఇన్నింగ్స్లో కూడా అదే తీరుగా పెవిలియన్కు చేరడం విమర్శలకు తావిచ్చింది. నిజానికి ధావన్ ఎడమచేతివాటం బ్యాట్స్మెన్ కావడం... ప్రత్యర్థి బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్ను దెబ్బ తీసేందుకు అతడు ఓ సాధనంగా పనికొస్తాడని కోహ్లీ భావించి తొలి టెస్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ స్ధానంలో ధావన్కి చోటు కల్పించాడు.

కోహ్లీ నమ్మకాన్ని వమ్ముచేసేలా ధావన్ బ్యాటింగ్
అయితే కోహ్లీ నమ్మకాన్ని వమ్ముచేసేలా ధావన్ బ్యాటింగ్ తీరు సాగింది. మరోవైపు స్వదేశంలో డబుల్ సెంచరీతో పాటు శ్రీలంకతో జరిగిన టెస్టు సిరిస్లో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ సఫారీ బౌలర్ల ముందు తేలిపోయాడు. తొలి ఇన్నింగ్స్లో సఫారీ బౌన్సర్లను ఎదుర్కొనేందుకు నానా ఇబ్బందులు పడిన రోహిత్... రెండో ఇన్నింగ్స్లో తానెంటే నిరూపించుకునే అవకాశం వచ్చినప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మ్యాచ్ అనంతరం రహానే స్ధానంలో రోహిత్ శర్మను ఎందుకు తీసుకున్నారని మీడియా అడిగిన ప్రశ్నలకు గాను కోహ్లీ సైతం తెల్లముఖం వేశాడు.
టెస్టుల్లో జట్టును నిలబెట్టేవి భాగస్వామ్యాలే
స్వదేశంలో ఆతడి ఫామ్ను దృష్టిలో పెట్టుకుని తుది జట్టులో చోటు కల్పించామని చెప్పడం విశేషం. తొలి టెస్టు ఓటమిలో భారత బ్యాట్స్మెన్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. వాస్తవానికి టెస్టుల్లో జట్టును నిలబెట్టేవి భాగస్వామ్యాలే. కేప్టౌన్లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో డివిలియర్స్-డుప్లెసిస్ల 114 పరుగులు, డికాక్-కేశవ్ మహరాజ్ల 60 పరుగుల భాగస్వామ్యం ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిందని చెప్పాలి. ఇక, రెండో ఇన్నింగ్స్లోనూ డివిలియర్స్ మరో ఎండ్లో కేశవ్ మహారాజ్తో 27 పరుగులు జోడించాడు.

భారత బ్యాట్స్మెన్ పూర్తిగా విఫలం
అయితే భారత బ్యాట్స్మెన్ మాత్రం ఇలా చేయడంతో పూర్తిగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్లో ఏడో వికెట్కు గాను 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పతే, రెండో రెండో ఇన్నింగ్స్లో ఎనిమిదో వికెట్కు 49పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ రెండు భాగస్వామ్యాలు కూడా లోయర్ ఆర్డర్లోనే నమోదు కావడం విశేషం.


Click it and Unblock the Notifications