|
1-0 ఆధిక్యంలో నిలిచిన న్యూజిలాండ్
మూడు టీ20ల సిరిస్లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత బ్యాట్స్మెన్లో ధోని (39), ధావన్(29), విజయ్ శంకర్(27), కృనాల్(20)లు రాణించడంతో టీమిండియా కనీసం ఈ స్కోరునైనా చేయగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ మూడు, ఫెర్గూసన్, సోధి, సాంట్నర్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు.
220 పరుగుల లక్ష్యంతో
220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాలో ఓపెనర్ రోహిత్ శర్మ(1) దారుణంగా విఫలమయ్యాడు. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్తో కలిసి మరో ఓపెనర్ శిఖర్ ధావన్ దాటిగా ఆడే ప్రయత్నం చేశాడు.
క్లీన్బౌల్డ్గా వెనుదిరిన శిఖర్ ధావన్
కానీ కివీస్ బౌలర్ ఫెర్గుసన్ బౌలింగ్లో శిఖర్ ధావన్(29) క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్(1) తీవ్రంగా నిరాశపరిచాడు. స్కోర్ పెంచే క్రమంలో ఒత్తిడికి గురైన ఆల్ రౌండర్ విజయ్ శంకర్(27) కూడా క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాండ్యా(4) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు.
139 పరుగులకే ఆలౌట్
ధోనితో కలిసి దూకుడుగా ఆడే క్రమంలో కృనాల్ పాండ్యా(20) కూడా కీపర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అయితే, చివర్లో ధోని(39), భువనేశ్వర్(1), చాహల్(1)లు వెంటవెంటనే పెవిలియన్కు చేరడంతో టీమిండియా 139 పరుగులకే ఆలౌటైంది. తొలి టీ20లో టీమిండియా ఘోరంగా విఫలం కావడంతో అభిమానులు నిరాశ చెందారు.