
గవాస్కర్ మాట్లాడుతూ
గవాస్కర్ మాట్లాడుతూ "వరల్డ్ కప్ నుంచి పాక్ను తప్పించాలని బీసీసీఐ ప్రయత్నించవచ్చు, కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే దీనికి ఇతర సభ్య దేశాలు కూడా అంగీకరించాలి. ఇది మీ రెండు దేశాల వ్యవహారం. ఇందులోకి మమ్మల్ని లాగొద్దు అని వాళ్లు అంటే పాకిస్థాన్ను తప్పించడం సాధ్యం కాదు. ఐక్య రాజ్య సమితిలోనే ఈ అంశం తేల్చుకోవాలి. అదే సరైన వేదిక" అని గవాస్కర్ స్పష్టం చేశాడు.

పాక్తో భారత్ ఆడకూడదు నిర్ణయం తీసుకుంటే
అంతేకాదు వరల్డ్కప్లో పాక్తో భారత్ ఆడకూడదు అని నిర్ణయం తీసుకుంటే అది మనకే నష్టమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. "ఎందుకంటే పాక్తో భారత్ ఆడకపోతే ఆ జట్టుకు రెండు పాయింట్లు లభిస్తాయి. వరల్డ్కప్లాంటి టోర్నీలో రెండు పాయింట్లు వదులుకోవడం మంచిది కాదు. ఇప్పటివరకు ఆడిన ప్రతి వరల్డ్కప్లో పాకిస్థాన్ను మనం ఓడించాం. ఈ టోర్నీలో కూడా వాళ్లతో ఆడి ఓడించాలి" అని గవాస్కర్ అన్నాడు.

ఊరికే రెండు పాయింట్లు పాక్కు ఇవ్వకూడదు
"ఆ రెండు పాయింట్లు వాళ్లకు ఇవ్వకూడదు. ద్వైపాక్షిక సిరీస్ ఆడకపోవడం వల్ల ఇప్పటికే పాకిస్థాన్కు భారీ నష్టం వాటిల్లుతోంది. అది చాలు. వరల్డ్కప్లాంటి టోర్నీలో పాకిస్థాన్ను అనవసరంగా పాయింట్లు ఇవ్వకూడదు. వాళ్లను ఓడించి సెమీఫైనల్ రాకుండా చేయాలి. పాకిస్థాన్తో ఆడకున్నా క్వాలిఫై అయ్యే సత్తా టీమిండియాకు ఉంది" అని గవాస్కర్ చెప్పాడు.

రాజకీయాలు మాట్లాడటం లేదు, నేను దేశంతో ఉన్నా
"కానీ ఊరికే పాక్కు ఎందుకు పాయింట్లు ఇవ్వాలి. నేను రాజకీయాల గురించి మాట్లాడటం లేదు. నేను దేశంతో ఉన్నాను. ప్రభుత్వం, దేశం ఏది నిర్ణయిస్తే దానిని నేను స్వాగతిస్తాను. కానీ పాకిస్థాన్తో వరల్డ్కప్లో ఆడకపోతే మనకే నష్టమన్న వాస్తవాన్ని అభిమానులు గుర్తించాలి" అని గవాస్కర్ స్పష్టం చేశాడు.

మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్కప్
ప్రారంభమవుతుండగా జూన్ 16న మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాపోర్డ్ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. వరల్డ్కప్లో పాక్తో భారత్ మ్యాచ్ ఆడకూడదని అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తుండటంతో దీనిపై ఐసీసీ దృష్టి సారించింది. మరోవైపు బీసీసీఐ సైతం పాక్తో మ్యాచ్ ఆడకూడదనే నిర్ణయానికి సూచన ప్రాయంగా వచ్చింది. ఇలాంటి తరుణంలో గవాస్కర్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.


Click it and Unblock the Notifications












