న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇండియా బ్లూ: గ్రీన్‌తో మ్యాచ్‌ డ్రా

By Nageshwara Rao
India Blue in Duleep Trophy Final

హైదరాబాద్: దులీప్‌ ట్రోఫీలో భారత్‌ బ్లూ జట్టు ఫైనల్లో ప్రవేశించింది. ఇండియా గ్రీన్‌తో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌ను డ్రా చేసుకున్న బ్లూ, మంగళవారం నుంచి జరిగే టైటిల్‌ పోరులో ఇండియా రెడ్‌తో తలపడనుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 21/0తో శనివారం నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇండియా బ్లూ టీమ్ ఆదిత్య సర్వతె (5/32) ధాటికి 117 పరుగులకే కుప్పకూలింది.

ఇండియా బ్లూ జట్టులో షోరె (40) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 201 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌ గ్రీన్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. బ్లూ రెండో ఇ న్నింగ్స్‌లో 20/2తో ఉన్న సమయంలో భారీ వ ర్షం కురవడంతో ఆట సాధ్యపడలేదు. దీంతో మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు.

తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో బ్లూకు 3 పాయింట్లు, గ్రీన్‌‌కు ఓ పాయింట్‌ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్లూ 340 రన్స్‌ చేయగా.. గ్రీన్‌ 257 స్కోరు చేసింది. మంగళవారం జరిగే ఫైనల్లో ఇండియా బ్లూ జట్టు రెడ్‌ జట్టుతో పోటీపడనుంది.

Story first published: Sunday, September 2, 2018, 9:43 [IST]
Other articles published on Sep 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X