హైదరాబాద్: దులీప్ ట్రోఫీలో భారత్ బ్లూ జట్టు ఫైనల్లో ప్రవేశించింది. ఇండియా గ్రీన్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ను డ్రా చేసుకున్న బ్లూ, మంగళవారం నుంచి జరిగే టైటిల్ పోరులో ఇండియా రెడ్తో తలపడనుంది. ఓవర్నైట్ స్కోరు 21/0తో శనివారం నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇండియా బ్లూ టీమ్ ఆదిత్య సర్వతె (5/32) ధాటికి 117 పరుగులకే కుప్పకూలింది.
ఇండియా బ్లూ జట్టులో షోరె (40) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 201 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ గ్రీన్ను వరుణుడు అడ్డుకున్నాడు. బ్లూ రెండో ఇ న్నింగ్స్లో 20/2తో ఉన్న సమయంలో భారీ వ ర్షం కురవడంతో ఆట సాధ్యపడలేదు. దీంతో మ్యాచ్ను డ్రాగా ప్రకటించారు.
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో బ్లూకు 3 పాయింట్లు, గ్రీన్కు ఓ పాయింట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్లో బ్లూ 340 రన్స్ చేయగా.. గ్రీన్ 257 స్కోరు చేసింది. మంగళవారం జరిగే ఫైనల్లో ఇండియా బ్లూ జట్టు రెడ్ జట్టుతో పోటీపడనుంది.