
కెప్టెన్గా అత్యంత వేగంగా 9 వేల పరుగులు
తద్వారా వన్డేల్లో కెప్టెన్గా అత్యంత వేగంగా 9 వేల పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేవలం 159 ఇన్నింగ్స్ల్లోనే విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీపాంటింగ్ పేరుపై ఉండేది. పాంటింగ్ 204 ఇన్నింగ్స్లలో ఈ ఘనత సాధించాడు.

2000 సంవత్సరంలో
2000 సంవత్సరంలో కెన్యాపై గంగూలీ నాయకత్వంలో 200వ విజయం సాధించింది. 2007లో ద్రవిడ్ కెప్టెన్సీలో విండీస్ 300వ, 2012లో కొలంబోలో ధోనీ కెప్టెన్సీలో శ్రీలంకపై 400వ విజయాన్ని నమోదు చేసింది. 400వ విజయంలో సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన కోహ్లీ, ఇప్పుడు 500 విజయంలోనూ సెంచరీ(116) సాధించాడు.

ఎవరిపై ఎన్ని విజయాలు సాధించిందంటే
విరాట్ కోహ్లీ సెంచరీలు చేసిన 33 వన్డేల్లో భారత్ విజయం సాధించింది. సచిన్ కూడా 33సార్లు సెంచరీలు చేసి భారత్ను గెలిపించాడు. అయితే భారత్ ఎక్కువ విజయాలు సాధించింది శ్రీలంకపైనే. ఆ జట్టును ఏకంగా 90సార్లు ఓడించడం విశేషం. ఎవరిపై ఎన్ని విజయాలు సాధించిందంటే..
శ్రీలంక- 90
వెస్టిండీస్- 59
న్యూజిలాండ్- 55
పాకిస్థాన్- 54,
ఇంగ్లండ్ -53,
జింబాబ్వే- 51
ఆస్ట్రేలియా- 49
సౌతాఫ్రికా- 34,
బంగ్లాదేశ్- 29
కెన్యా- 11
ఐర్లాండ్-3
యూఏఈ- 3
హాంకాంగ్-2
నెదర్లాండ్స్-2
ఆప్ఘనిస్థాన్- 1
బెర్ముడా-1
ఈస్ట్ ఆఫ్రికా-1
స్కాట్లాండ్-1
నమీబియా-1


Click it and Unblock the Notifications












