ఆక్లండ్ : ఇక్కడ శనివారం జరిగిన భారత్ -న్యూజిలాండ్ ల మధ్య జరిగిన ఐదవ వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా ఆటగాళ్లు 36.3 ఓవర్లలో 149 పరుగులకే ఆల్ ఔట్ అయ్యారు. వర్షం కారణంగా గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ ని 43 ఓవర్లుగా కుదించారు. గౌతమ్ గంభీర్ 5, సెహ్వాగ్ 40, రైనా 8, రోహిత్ శర్మ (నాట్ ఐట్ ) 43, యువరాజ్ సింగ్ 11, కెప్టెన్ ధోనీ 9, యూసుఫ్ పఠాన్ 0, హర్భన్ సింగ్ (రన్ ఔట్ ) 1, జహీర్ ఖాన్ 5, కుమార్ 6, ఐ.శర్మ 3, ఎక్స్ ట్రాస్ 18 పరుగులు సాధించారు.