For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇండియాకు చేదు పరాభవం!: సెమీ ఫైనల్లోకి పాకిస్తాన్

India A vs Pakistan A: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో భాగంగా భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్ల మధ్య ఆరో మ్యాచ్ జరిగింది. ఆదివారం ఖతార్ రాజధాని దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు పాకిస్తాన్-ఏ చేతిలో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్-ఏ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.

టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ జట్టు ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లోనే 136 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ, నమన్ ధీర్ కలిసి రెండో వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వైభవ్ సూర్యవంశీ తన అర్థశతకాన్ని కొద్దిలో చేజార్చుకున్నాడు. వైభవ్ 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లాంగ్-ఆన్‌లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.సూర్యవంశీ వికెట్ పడిన తర్వాత ఇండియా-ఏ పట్టు కోల్పోయింది. ఒక దశలో 101/3గా ఉన్న స్కోరు, చివరి ఏడు వికెట్లకు కేవలం 35 పరుగులు మాత్రమే జోడించి, 136 పరుగులకు ఆలౌట్ అయింది.

India A Suffers Heavy Defeat Pakistan A Storms Into Asia Cup Rising Stars 2025 Semifinals

ఒకానొక సమయంలో అంటే 10వ ఓవర్ ముగిసేసరికి, టీమ్ స్కోరు కేవలం రెండు వికెట్ల నష్టానికి 91 పరుగులుగా ఉంది. అయితే ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ కుప్పకూలడంతో ఇండియా-ఏ తక్కువ స్కోరుకే ఆలౌట్ అయింది. పాకిస్తాన్-ఏ బౌలర్లలో షహీద్ అజీజ్ అద్భుతంగా రాణించాడు. అతను మూడు వికెట్లు తీసి ఇండియా-ఏ పతనంలో కీలక పాత్ర పోషించాడు.

లక్ష్య ఛేదనలో పాకిస్తాన్-ఏ జట్టు దూకుడుగా ఆడింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 14వ ఓవర్‌లోనే సులభంగా లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయం నమోదు చేసింది. పాకిస్తాన్-ఏ ఓపెనర్ మాజ్ సాదఖత్ అజేయ అర్థశతకంతో విజృంభించడంతో ఇండియా-ఏ జట్టు 8 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. 137 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన పాకిస్తాన్-ఏ తరఫున ఓపెనర్ మాజ్ సాదఖత్ అద్భుతంగా రాణించాడు. అతను కేవలం 47 బంతుల్లోనే 79 పరుగులతో అజేయంగా నిలిచాడు. మాజ్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా పాకిస్తాన్ జట్టు లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే ఛేదించింది.

సెమీ-ఫైనల్స్‌లో అడుగుపెట్టిన పాకిస్తాన్-ఏ
ఇండియా-ఏపై విజయం సాధించడంతో పాకిస్తాన్-ఏ జట్టు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్‌లో సెమీ-ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
మరోవైపు ఇండియా-ఏ జట్టు టోర్నమెంట్‌లో నిలబడాలంటే తమ తదుపరి మ్యాచ్‌లో తప్పనిసరిగా విజయం సాధించాలి.గ్రూప్-బి నుంచి రెండో సెమీ-ఫైనల్ స్థానం కోసం ప్రస్తుతం మూడు జట్లు పోటీపడుతున్నాయి. అవి ఇండియా-ఏ, ఒమన్, యూఏఈ. ఇండియా-ఏ జట్టు నవంబర్ 18న ఒమన్‌తో కీలకమైన మ్యాచ్ ఆడనుంది. సెమీ-ఫైనల్స్‌కు చేరుకోవాలంటే ఇండియా-ఏకు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్. ఈ మ్యాచ్ ఫలితం, అలాగే యూఏఈ ప్రదర్శన గ్రూప్-బి నుంచి రెండో అర్హత పొందే జట్టును నిర్ణయిస్తాయి.

Story first published: Sunday, November 16, 2025, 23:38 [IST]
Other articles published on Nov 16, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+