IND vs ENG: ఇంగ్లాండ్ పర్యటనకు 20 మంది సభ్యులతో కూడిన ఇండియా-ఏ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) శుక్రవారం ప్రకటించింది. ఈ పర్యటనలో ఇండియా-ఏ జట్టు ఇంగ్లాండ్ లయన్స్తో రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడుతుంది. ఈ పర్యటనకు భారత మాజీ క్రికెటర్ హృషికేశ్ కనిత్కర్ను టీమిండియా కోచ్గా నియమించారు. ఈ పర్యటన యువ ఆటగాళ్లకు గొప్ప అవకాశంగా ఉంటుంది. ఇంగ్లాండ్ సవాలుతో కూడిన పరిస్థితులు వారికి భవిష్యత్లో అవకాశాలను కల్పించనున్నాయి.
హృషికేశ్ కనిత్కర్ ఇండియా-ఏ జట్టుకు కోచ్ కావడం గురించి ఓ సీనియర్ జర్నలిస్ట్ వెల్లడించారు. బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు హృషికేశ్ కనిత్కర్ గురించి మాట్లాడుతూ... ఆయనకు ఆటగాళ్లతో కలిసి పనిచేయడంలో మంచి అనుభవం ఉందని చెప్పుకొచ్చారు. కనిత్కర్ వ్యూహాత్మక ఆలోచన జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. హృషికేష్ కనిత్కర్ కోచింగ్ ఇంగ్లాండ్ పరిస్థితులలో భారత ఆటగాళ్లకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు.

భారత్ తరఫున చాలా మ్యాచ్లు ఆడిన హృషికేశ్ కనిత్కర్
భారత్ తరఫున రెండు టెస్టులు, 34 వన్డేలు ఆడిన హృషికేశ్ గత కొన్ని సంవత్సరాలుగా మహిళల క్రికెట్లో కోచ్గా ముఖ్యమైన పాత్ర పోషించారు. హృషికేశ్ కనిత్కర్ 2023 టీ20 ప్రపంచ కప్లో భారత మహిళల జట్టుతో బ్యాటింగ్ కోచ్గా కూడా పని చేశాడు. హృషికేశ్ కనిత్కర్ శిక్షణలో, క్రీడాకారుల సాంకేతికత, మానసిక బలంలో అద్భుతమైన మెరుగదల కనిపించింది.
2025 జూన్-జులైలో ఇండియా ఏ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు ప్రతిపాదించబడింది. దీనిలో జట్టు నాలుగు రోజుల మ్యాచ్లు, పరిమిత ఓవర్ల మ్యాచ్లు ఆడాలి. ఈ పర్యటన లక్ష్యం యువ ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి సిద్ధం చేయడం. హృషికేశ్ కనిత్కర్ కోచ్గా ఉండటంతో ఈ పర్యటనలో భారత యువ జట్టు అద్బుతంగా రాణిస్తుందని, సీనియర్ జట్టులో స్థానం సంపాదించడానికి బలమైన అడుగు వేస్తుందని భావిస్తున్నారు.
ఇంగ్లాండ్ పర్యటనకు ఇండియా-ఏ జట్టు ఇదే..
అభిమన్యు ఈశ్వరన్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురేల్(వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముకేష్ కుమార్, ఆకాష్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్ పాండే, హర్ష్ దూబే.
ఇండియా ఏ జట్టు పూర్తి షెడ్యూల్
మే 30-జూన్ 2 : ఇంగ్లాండ్ లయన్స్ వర్సెస్ ఇండియా ఏ, కాంటర్బరీ.
జూన్ 6-జూన్ 9: ఇంగ్లాండ్ లయన్స్ వర్సెస్ ఇండియా ఏ, నార్తాంప్టన్.
జూన్ 13-జూన్ 16: ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్లు, బెకెన్హామ్.