IND W vs PAK W: భారత మహిళల జట్టు హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో కొలంబోలో నేడు పాకిస్తాన్ను ఢీకొట్టనుంది. గత నెల రోజుల్లో ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ మైదానంలో ఇది నాలుగో పోరు. భారత జట్టు టోర్నమెంట్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది. టీమిండియా తమ తొలి మ్యాచ్లో విజయం సాధించగా.. పాకిస్తాన్ తమ ప్రపంచ కప్ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైంది. ఈ కీలక మ్యాచ్ కు వాతావరణం ఎలా ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వాతావరణ అంచనా.. టాస్ ఆలస్యం అయ్యే అవకాశం
మ్యాచ్కు ముందు కొలంబోలో వర్షం పడే అవకాశం ఉండటంతో టాస్ ఆలస్యం కావచ్చు. ఇది భారత జట్టుకు అతిపెద్ద సవాలుగా నిలవనుంది. ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. ఉదయం పూట తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే మధ్యాహ్నం, ఆట ప్రారంభ సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండే అవకాశం ఉంది. కానీ చెడు వార్త ఏమిటంటే.. రాత్రి పూట ముఖ్యంగా లక్ష్యాన్ని ఛేదించే సమయంలో వర్షం రెండో సారి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇరు జట్లు డక్వర్త్-లూయిస్(డీఎల్ఎస్) నియమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆడాల్సి ఉంటుంది. శనివారం కొలంబోలో కురిసిన భారీ వర్షం వల్ల ఆతిథ్య శ్రీలంక, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ రద్దైంది.

పిచ్ పరిస్థితి, గ్రౌండ్స్మెన్ పాత్ర
కొలంబో పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. క్యూరేటర్లు పిచ్పై కాస్త ఎండు గడ్డి ఉంచారు. దీనివల్ల వికెట్కు కొంత వేగం లభించవచ్చు. బౌలర్లు తమ లెంగ్త్ను ఫుల్గా ఉంచడం ద్వారా ప్రభావం చూపవచ్చు. శ్రీలంకలో భారత్ తమ మొదటి ప్రపంచ కప్ మ్యాచ్ ఆడుతున్నందున, అక్కడ ఆడటం అంత సులభం కాదు.
వర్షం అంతరాయం కలిగిస్తే, కొలంబో గ్రౌండ్స్మెన్ కీలక పాత్ర పోషిస్తారు. వర్షం తగ్గిన తర్వాత నీటిని తొలగించడానికి ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించే వీరు ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రౌండ్స్మెన్గా పరిగణించబడతారు. వారి చురుకుదనం వల్ల ఆటలో అంతరాయాలను తగ్గించి, ఆటను త్వరగా ప్రారంభించడానికి సహాయపడుతుంది. టోర్నమెంట్ ప్రారంభంలో కాస్త కంగారుపడిన టీమిండియా.. ఈ హై-ప్రొఫైల్ మ్యాచ్లో గెలిచి తమ బలాన్ని నిరూపించుకోవాలని చూస్తోంది.