భారత్తో జరగనున్న మూడు టీ20ల సిరీస్కు శ్రీలంక తమ జట్టును ప్రకటించింది. పల్లకెలె వేదికగా జులై 27 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్కు 16 మందితో కూడిన బృందాన్ని వెల్లడించింది. జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. వానిందు హసరంగా సారథి బాధ్యతల నుంచి తప్పుకోవడంతో చరిత్ అసలంక జట్టు పగ్గాలు అందుకున్నాడు.
టీ20 వరల్డ్ కప్-2024లో శ్రీలంక గ్రూప్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అనంతరం ఓటమికి బాధ్యత వహిస్తూ హసరంగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఎడమచేతి వాటం బ్యాటర్ చరిత్ అసలంకను నియమించారు. అసలంక మూడు టెస్టులు, 59 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. పొట్టి ఫార్మాట్లో 1061 పరుగులు చేశాడు.

శ్రీలంక టీ20 జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేష్ చండిమాల్, కామిందు మెండిస్, దసున్ షనక, వానిందు హసరంగా, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీషా పతిరనా, నువాన్ తుషారా, దుష్మాంత చమీర, బినూర ఫెర్నాండో.
భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషభ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.