Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: విశాఖపట్నంలో టాస్ గెలిస్తే, మ్యాచ్ గెలిచినట్టే!

IND vs SA: ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు విశాఖపట్నంలోని క్రికెట్ స్టేడియంలో నిర్ణయాత్మకమైన మూడో వన్డే జరగనుంది. రాంచీ వన్డేలో భారత్ గెలవగా.. రాయ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాలో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో టాస్ గెలిస్తే భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ ఏం చేయాలి? అనే దాని వెనుక ఒక బలమైన కారణం దాగి ఉంది.

టాస్ గెలిస్తే గ్యారెంటీ!
టీమిండియా వరుసగా టాస్ ఓడిపోవడం టీమ్ కష్టాలను మరింత పెంచుతోంది. 2023 వరల్డ్ కప్ సెమీఫైనల్ తర్వాత నుంచి (సుమారు 2 ఏళ్లుగా) ఏ భారత కెప్టెన్ కూడా వన్డేల్లో టాస్ గెలవలేకపోవడం గమనార్హం.అయితే విశాఖపట్నంలో కేఎల్ రాహుల్ టాస్ గెలిచి, ముందుగా బౌలింగ్ ఎంచుకుంటే, టీమిండియా విజయం సాధించడం దాదాపు గ్యారెంటీ అవుతుంది. దీంతో భారత్ సిరీస్‌ను కూడా గెలుచుకుంటుంది. ఎందుకనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

IND vs SA Vizag ODI Win the Toss Win the Match Stunning Stats Reveal Advantage for India

మహిళా వరల్డ్ కప్ సీక్రెట్
ఇటీవల విశాఖపట్నంలో మహిళా వరల్డ్ కప్‌లో 5 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. ఈ ఐదు మ్యాచ్‌లలోనూ లక్ష్యాన్ని ఛేదించిన జట్టే విజయం సాధించింది. ఆస్ట్రేలియా భారత్‌పై 331 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దక్షిణాఫ్రికా 81/5 స్థితి నుంచి కోలుకొని 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలిగింది.ఈ గణాంకాలు.. సాయంత్రం వేళ ఇక్కడ చేజింగ్ సులభంగా ఉంటుందని స్పష్టమైన సంకేతం ఇస్తున్నాయి. కాబట్టి, టాస్ గెలిస్తే తొలుత బౌలింగ్ చేయడం ద్వారా సాయంత్రం సులువుగా లక్ష్యాన్ని ఛేదించవచ్చు.

భారత్‌పై ఒత్తిడి.. 40 ఏళ్ల నాటి రికార్డుకు చేరువలో దక్షిణాఫ్రికా
భారత జట్టు సొంత గడ్డపై తరచుగా సిరీస్‌లు ఓడిపోదు. ఒకే ద్వైపాక్షిక పర్యటనలో టెస్ట్ సిరీస్‌, వన్డే సిరీస్ రెండింటినీ స్వదేశంలో ఓడిపోవడం దాదాపు 40 ఏళ్ల క్రితం జరిగింది. ఆఖరిసారిగా 1986-87లో పాకిస్తాన్ భారత్‌ను టెస్టుల్లో 1-0తో, వన్డేల్లో 5-1తో ఓడించింది. ఇప్పుడు దక్షిణాఫ్రికా (టెస్ట్ సిరీస్ తర్వాత) వన్డే సిరీస్ గెలిస్తే ఆ అరుదైన 'డబుల్' ఘనతను సాధించేందుకు చాలా దగ్గరగా ఉంది. ఈ కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు భారత్‌పై బంతితో తొందరగా ఒత్తిడి పెంచాలని చూస్తుంది. విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు, రుతురాజ్ గైక్వాడ్, రోహిత్ శర్మ కూడా పరుగులు చేసినప్పటికీ.. భారత్ తొలి వికెట్లను త్వరగా కోల్పోతే పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

తుది జట్లు (అంచనా)
ఇండియా జట్టు: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్ & వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.

దక్షిణాఫ్రికా జట్టు: క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్, టెంబా బవుమా (కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్‌కే, రూబిన్ హర్మన్, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, లుంగీ ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మాన్.

Story first published: Saturday, December 6, 2025, 12:55 [IST]
Other articles published on Dec 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+