భారత్కు శుభారంభం:
మయాంక్ అగర్వాల్ (84; 183 బంతుల్లో, 11x4, 2x6)తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ భారత్కు మంచి శుభారంభం అందించాడు. పర్యాటక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్న ఓపెనర్లు వికెట్ల నడుమ చక్కటి సమన్వయంతో పరుగులు తీస్తున్నారు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ.. సింగిల్స్ తీస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడుపుతున్నారు. సన్నాహక మ్యాచ్లో పరుగులేమీ సాధించకుండా ఔటైన రోహిత్ తొలి ఇన్నింగ్స్లో ఎలా ఆడతాడోనని అంతా ఆందోళన చెందారు. కానీ ఆరంభంలో ఆచితూచి ఆడిన రోహిత్.. అనంతరం తనదైన శైలిలో రెచ్చిపోయాడు.
అష్ట కష్టాలు పడుతున్న బౌలర్లు:
రోహిత్ కుదురుకున్నాడంటే అతని ప్రతాపం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనక్కర్లేదు. రోహిత్, అగర్వాల్ మొదటి వికెట్కు ఇప్పటికే 202 పరుగుల భాగస్వామ్యం అందించారు. అగర్వాల్ కూడా సెంచరీకి దగ్గరగా వచేసాడు. తనదైన షాట్లతో అలరిస్తూ.. రోహిత్కు చక్కటి సహకారం అందిస్తున్నాడు. ఈ జోడీని విడదీయడానికి ప్రొటీస్ బౌలర్లు అష్ట కష్టాలు పడుతున్నారు. స్టార్ పేసర్ రబాడా కూడా చేతులెత్తేశాడు. మరోవైపు స్పిన్నర్లు కూడా ప్రభావం చూపలేకపోతున్నారు. ఓపెనర్లు ఇలాగే చెలరేగితే టీమిండియా భారీ స్కోర్ సాధించడం ఖాయం.
వికెట్ నష్టపోకుండా 202 పరుగులు:
టీ విరామం సమయానికి భారత్ 59 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 202 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్ శర్మ (115), మయాంక్ అగర్వాల్ (4) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ల ఆటతో విశాఖ స్టేడియం హోరెత్తుతోంది. అభిమానులు కేరింతలతో స్టేడియం మొత్తం సందడిగా మారింది. రోహిత్ ఓపెనర్గా తొలి మ్యాచ్లోనే సెంచరీ సాధించి సత్తా చాటాడు.
ఓపెనర్గా తొలి మ్యాచ్లోనే సెంచరీ చేసిన ఆటగాళ్లు:
# శిఖర్ ధావన్ (187) vs ఆస్ట్రేలియా, మొహాలీ, 2013-14
# కేఎల్ రాహుల్ (110) vs ఆస్ట్రేలియా, మెల్బోర్న్, 2014-15
# పృథ్వీ షా (134) vs వెస్టిండీస్, రాజ్కోట్, 2018-19
# రోహిత్ శర్మ (115 నాటౌట్) vs సౌతాఫ్రికా, వైజాగ్, 2019-20