
పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022లో భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర సాగిస్తోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లల్లో ఘన విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థులను చిత్తు చేసింది. గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. ఇక తన తదుపరి మ్యాచ్ను ఆదివారం ఆడబోతోంది. దక్షిణాఫ్రికాను ఎదుర్కొనబోతోంది. ఈ రెండు జట్లు కూడా గ్రూప్-2లో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.
ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. పెర్త్ స్టేడియం దీనికి వేదిక. ఈ మ్యాచ్ కోసం టీమ్ మొత్తం పెర్త్కు చేరుకుంది కూడా. అక్కడే నెట్ ప్రాక్టీస్ చేస్తోంది. దక్షిణాఫ్రికాతో భారత్ పోరు మాత్రమే కాకుండా- మరో రెండు మ్యాచ్లు షెడ్యూల్ అయ్యాయి. తొలి మ్యాచ్లో బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియం వేదికగా బంగ్లాదేశ్-జింబాబ్వే తలపడనున్నాయి. ఉదయం 8:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతంది.
పెర్త్ స్టేడియంలో జరిగే రెండో మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు నెదర్లాండ్స్ను ఢీ కొట్టాల్సి ఉంది. ఇది మధ్యాహ్నం 12:30 గంటలకు మొదలవుతుంది. ఇదే పెర్త్ స్టేడియంలో సాయంత్రం 4:30 గంటలకు దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది టీమిండియా. ఈ పరిణామాల మధ్య కేప్టెన్ రోహిత్ శర్మ ఈ మధ్యాహ్నం 12:15 నిమిషాకలకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాడు. పెర్త్ స్టేడియం కాన్ఫరెన్స్ హాల్లో ఇది ఏర్పాటయింది.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో అనుసరించేబోయే వ్యూహాలు, తుదిజట్టు అంచనాలు, టీ20 ప్రపంచకప్ 2022లో జట్టు ప్రస్థానం, ఇప్పటివరకు సాధించిన విజయాలకు గల కారణాలు.. ఇవన్నీ ఈ విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ ప్రస్తావించే అవకాశం ఉంది. అన్నింటికీ మించి ఓపెనర్ కేఎల్ రాహుల్ వైఫల్యంపై రోహిత్ శర్మ స్పందిస్తారని తెలుస్తోంది. కేఎల్ రాహుల్ వరుసగా విఫలమౌతోన్న నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్లో అతన్ని డిమోట్ చేయొచ్చనే ప్రచారం ఉంది.