For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs PAK: సూపర్-4లో భారత్‌కు భారీ ముప్పు.. ఈ 5 విషయాలు ప్రమాదకరం!

IND vs PAK: ఆసియా కప్ 2025లో భాగంగా మరోసారి భారత్-పాక్ పోరుకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 21న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్లు సూపర్-4 తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. గత గ్రూప్ మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌ను ఓడించినప్పటికీ.. సూపర్-4లో టీమిండియా అప్రమత్తంగా ఉండటానికి 5 ముఖ్య కారణాలు ఉన్నాయి.

1. అంచనాకు అందనా జట్టు
పాకిస్థాన్ క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత అంచనాకు అందని జట్టుగా పరిగణిస్తారు. వారు గెలిచే మ్యాచ్‌లను కూడా ఊహించని విధంగా కోల్పోతారు. అదే విధంగా ఓడిపోయే మ్యాచ్‌లను కూడా గెలిచేస్తారు. ఇటీవల కాలంలో ఫామ్ సరిగ్గా లేకపోయినా.. ఒకే మ్యాచ్‌లో జట్టు మొత్తం తమ ఆటతీరును మార్చేసి ప్రమాదకరంగా మారే సత్తా వారికుంది. పాక్ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.

IND vs PAK Big Threat to India in Super-4 These 5 Things Are Dangerous

2. ఓవర్ కాన్ఫిడెన్స్
ఏ జట్టు అయినా ఎక్కువ కాలం మంచి ఫామ్‌ లో ఉన్నప్పుడు.. అప్పుడప్పుడు ఓ చెత్త మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. 2023 ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టుకు ఇదే జరిగింది. టీమిండియా టీ20 ఫార్మాట్లో చాలా కాలంగా అద్భుతంగా రాణిస్తోంది. ఒకవేళ పాకిస్థాన్‌తో జరిగే కీలకమైన మ్యాచ్‌లో ఇలాంటి ప్రదర్శన ఎదురైతే.. అది భారత్‌కు ఇబ్బందికరంగా మారుతుంది. గత 7 మ్యాచ్‌లలో పాకిస్థాన్ పై భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.

3. దుబాయ్ స్టేడియంలో అనుభవం
పాకిస్థాన్ జట్టుకు దుబాయ్ స్టేడియంలో ఆడిన అనుభవం చాలా ఎక్కువ. ప్రపంచ కప్ చరిత్రలో భారత్ కు పాకిస్థాన్ చేతిలో ఒక్కసారి మాత్రమే ఓటమి ఎదురైంది. అది కూడా దుబాయ్ స్టేడియంలోనే కావడం గమనార్హం. పాకిస్థాన్ ఈ మైదానంలో 35 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. ఇతర ఏ జట్టు కూడా 15 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. ఈ మైదానంపై ఉన్న అవగాహన వారికి ఒక అదనపు బలంగా పనిచేస్తుంది.

4. ప్రతీకారం తీర్చుకోవాలనే కసి
గ్రూప్ మ్యాచ్‌లో భారత జట్టు చేతిలో పాకిస్థాన్ అవమానాన్ని ఎదుర్కొంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, ఆ తర్వాత ఏకపక్షంగా ఓడిపోవడం, మ్యాచ్ తర్వాత కూడా కరచాలనం చేయకపోవడం వంటి ఘటనలు పాకిస్థాన్ ఆటగాళ్లలో ప్రతీకార జ్వాలలను రగిలించాయి. దీనికి తోడు రిఫరీని తొలగించాలనే వారి డిమాండ్ కూడా తిరస్కరించబడింది. ఐసీసీ కూడా వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇవన్నీ కలిసి పాకిస్థాన్‌కు మరింత కసిని పెంచుతాయి.

5. 2022లో ఎదురైన అనుభవం
2022లో టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్‌లో కూడా ఇదే యూఏఈలో భారత్ పాకిస్థాన్‌పై గ్రూప్ మ్యాచ్‌‌లో విజయం సాధించింది. కానీ ఆ తర్వాత సూపర్-4లో పాకిస్థాన్ టీమిండియాను ఓడించింది. ఆ మ్యాచ్ కూడా ఇదే మైదానంలో జరిగింది. అదే చరిత్ర పునరావృతం కాకుండా చూసుకోవడం భారత జట్టుకు చాలా అవసరం. గతంలో ఎదురైన ఓటమిని భారత్ దృష్టిలో పెట్టుకుని మరింత జాగ్రత్తగా ఆడాలి.

Story first published: Saturday, September 20, 2025, 12:06 [IST]
Other articles published on Sep 20, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+