బ్లాక్ బస్టర్ సండే..
ఆసియా కప్ తరహాలోనే భారత్- తన తొలి మ్యాచ్లోనే పాకిస్తాన్తో తలపడనుంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్లో ఈ నెల 23వ తేదీన ఆదివారం భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం ఒకటిన్నరకు మ్యాచ్ షెడ్యూల్ అయింది. ప్రస్తుతం ఊపు మీద ఉంది పాకిస్తాన్. న్యూజిలాండ్లో జరిగిన ముక్కోణపు సిరీస్లో విజేతగా నిలిచింది. న్యూజిలాండ్-పాకిస్తాన్-బంగ్లాదేశ్ పాల్గొన్న సిరీస్ ఇది. ఫైనల్స్లో బ్లాక్ క్యాప్స్ను సొంతగడ్డపై మట్టి కరిపించింది.

కేప్టెన్ల ఫొటోషూట్..
ఈ ఆదివారం నుంచి టీ20 ప్రపంచకప్ 2022 ఆరంభం కాబోతోన్న నేపథ్యంలో- 16 జట్ల కేప్టెన్లందరూ ఒకే వేదికపైకి వచ్చారు. అందరూ కలిసి ఫొటోలు తీసుకున్నారు. ఫొటోషూట్లో పాల్గొన్నారు. సరదాగా గడిపారు. అదే స్టేజ్పై పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్.. తన పుట్టినరోజును కూడా జరుపుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బాబర్ ఆజమ్కు ఇతర జట్ల కేప్టెన్లందరూ బర్త్డే విషెస్ తెలిపారు. సందడి సందడిగా సాగిందీ ప్రోగ్రామ్.
స్పెషల్ అట్రాక్షన్గా..
ఈ కార్యక్రమానికి రోహిత్ శర్మ-బాబర్ ఆజమ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఇద్దరూ ప్రత్యేకంగా ఫొటో షూట్లో పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీన భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ను సందర్భంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రొటోకాల్ ప్రకారం.. రెండు జట్ల కేప్టెన్లు ఫొటోషూట్లో పాల్గొనడం ఆనవాయితీ. దీన్ని కొనసాగించారీ ఇద్దరు కేప్టెన్లు. డిఫరెంట్ ఫోజుల్లో ఫొటోలకు ఫోజులిచ్చారు. సరదాగా, స్నేహితుల్లా గడిపారు.

ట్రోల్స్ షురూ..
ఈ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కొద్దిసేపటికే ట్రోల్స్ మొదలయ్యాయి. రోహిత్ శర్మపై క్రికెట్ అభిమానులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారు. ఆసియా కప్లోనూ ఇలాగే ఫొటోలకు ఫోజులిచ్చారని, దాని సంగతి ఏమైందో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానిస్తోన్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి తెలిసి కూడా క్లోజ్గా వ్యవహరించడాన్ని తప్పుపడుతున్నారు.


Click it and Unblock the Notifications
