IND vs NZ Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఐసీసీ సిరీస్లలో ఇప్పటివరకు న్యూజిలాండ్ దే పైచేయి ఉన్నట్లు కనిపిస్తోంది. భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటివరకు ఐసీసీ వన్డే క్రికెట్ మ్యాచ్ లలో 12 సార్లు తలపడ్డాయి. భారత్ ఆరుసార్లు, న్యూజిలాండ్ ఆరుసార్లు గెలిచింది. ఇదిలా ఉండగా.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లీగ్ మ్యాచ్ లో భారత్ ఇప్పటికే న్యూజిలాండ్ ను ఓడించింది. దుబాయ్ పిచ్ లో స్పిన్ బౌలర్ల ఆధిపత్యం కొనసాగుతుంది. కానీ ఈ సిరీస్ లో న్యూజిలాండ్ జట్టు స్పిన్ బౌలర్లు భారత జట్టు లాగే తమ ప్రతిభను చూపిస్తున్నారు. ఫలితంగా ఎవరు గెలుస్తారనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. దీనిపై మాట్లాడుతూ.. పాకిస్థాన్ మాజీ ఆటగాడు వసీం అక్రం ఫైనల్ లో ఎవరు గెలుస్తారో అంచనా వేశాడు.
వసీం అక్రమ్ మాట్లాడుతూ.. "భారత్, న్యూజిలాండ్ జట్లకు తాము ఎలాంటి పిచ్ లో ఆడుతున్నామో బాగా తెలుసు. ముఖ్యంగా న్యూజిలాండ్ దుబాయ్ పిచ్ పై భారత్ పై బాగా రాణించగలదు. కాబట్టి భారత్ కు ఇది కచ్చితంగా అంత సులభం కాదు. కానీ ఈ సిరీస్ ను గెలుచుకునే జట్టు భారత్ అవుతుంది. కానీ అది అంత సులభం కాదు. భారత్ 70 శాతం, న్యూజిలాండ్ 30 అని కూడా చెప్పలేం. భారత్ గెలిచే అవకాశం 60 శాతం, న్యూజిలాండ్ గెలిచే అవకాశం 40 శాతం ఉంది. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా బలమైన జట్టు." అని వసీం అక్రమ్ అంచనా వేశాడు.

"అదే విధంగా న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ గా సాంట్నర్ బాగా రాణిస్తున్నాడు. అతనికి ఆత్మవిశ్వాసం, ప్రశాంతత ఉన్నాయి. విలియమ్సన్ లాదే అతను కూడా మైదానంలో ప్రశాంతంగా ఉంటాడు. అతని ఈ స్వభావం కచ్చితంగా జట్టుకు బలం అవుతుంది. మైదానంలో ప్రశాంతంగా ఉండటానికి, సోమరిగా ఉండడానికి మధ్య తేడా ఉంది. న్యూజిలాండ్ ఆటగాళ్లందరూ శాంతియుతమైన వ్యక్తులు." అని వసీం అక్రమ్ అన్నాడు.
అది న్యూజిలాండ్ మాత్రమే చేయగలదు: అజయ్ జడేజా
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ను ఓడించే జట్టు ఏదైనా ఉందంటే.. అది న్యూజిలాండ్ మాత్రమే చేయగలదని భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా అన్నారు. దక్షిణాఫ్రికా భారత్ తో తలపడుతుందని తాను వ్యక్తిగతంగా అనుకున్నానన్నారు. ఎందుకంటే దక్షిణాఫ్రికా జట్టు బలమైన జట్టు అని తెలిపాడు. న్యూజిలాండ్ జట్టులో రచిన్ రవీంద్ర, విలియమ్సన్ ఇద్దరూ బ్యాట్ తో రాణిస్తారని.. ఆ ఇద్దరు ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్ ను అద్భుతంగా ఎదుర్కొంటారని చెప్పాడు. దుబాయ్ లాంటి పిచ్ పై న్యూజిలాండ్ మాత్రమే భారత్ ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టగెలదన్నారు. భారత్ చిన్న తప్పు చేసినా న్యూజిలాండ్ దానిని సద్వినియోగం చేసుకుంటుందని అజయ్ జడేజా అన్నాడు.