దేశవ్యాప్తంగా సంక్రాంతి శోభ నెలకొంది. సంక్రాంతి అంటేనే మనకు టక్కున గుర్తొచ్చేది గాలిపటాలే. ఆ రంగురంగుల పతంగులు పైకెళ్లేకొద్దీ మన సంతోషం కూడా అంత ఎక్కువవుతుంటుంది.! అందుకే ఎప్పటిలాగే ఈ సంక్రాంతి కూడా చాలా మంది పతంగులు ఎగరేస్తూ పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే భారత మహిళా క్రికెటర్లు కూడా పతంగులను ఆకాశంలో ఎగరేస్తూ పండగను ఎంతో ఉత్సాహంతో జరుపుకున్నారు. ఐర్లాండ్ మహిళా జట్టు కూడా మన అమ్మాయిలతో కలిసి కైట్స్ ను ఎగరేస్తూ సందడి చేశారు. నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్ కు ముందు ఇరు జట్లు కలిసి ఎంతో ఉత్సాహంతో మకర సంక్రాంతి పండగను సెలబ్రేట్ చేసుకున్నారు.
