For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీ 71 సెంచరీ చేయడం ఒక కలగా మిగిలిపోనుంది! ఇక రిటైర్మెంట్ ఇచ్చే సమయం వచ్చేసింది!!

Ind vs Eng: Virat Kohli 71st Century Will Remain An Dream Says Indians Fans

హైదరాబాద్: ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభ‌మైన మూడో టెస్ట్ తొలి రోజు తొలి సెష‌న్‌లోనే టీమిండియా పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఇంగ్లండ్ పేస్ బౌల‌ర్ జేమ్స్ అండర్సన్‌ చెల‌రేగ‌డంతో 21 ప‌రుగుల‌కే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ (0), టెస్ట్ స్పెసలిస్ట్ బ్యాట్స్‌మన్‌ చేతేశ్వర్ పుజారా (1), కెప్టెన్ విరాట్ కోహ్లీ (7) దారుణంగా విఫ‌ల‌మయ్యారు. ఈ మూడు వికెట్లూ అండర్సన్‌ ఖాతాలోకే వెళ్లాయి.

జిమ్మీ ఆరు ఓవ‌ర్ల‌లో ఆరు ప‌రుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ముగ్గురు కీపర్‌ జోష్ బట్లర్‌కి క్యాచ్‌ ఇవ్వడం ఇక్కడ విశేషం. రోహిత్ శర్మ, అజింక్య రహానేలు జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.

7 పరుగులకే ఔట్

7 పరుగులకే ఔట్

జేమ్స్ అండ‌ర్స‌న్ వేసిన మ్యాచ్ తొలి ఓవ‌ర్‌లోనే.. కీప‌ర్ జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి లోకేష్ రాహుల్ వెనుదిరిగాడు. ఇన్నింగ్స్‌ ఐదవ బంతిని అతడు డ్రైవ్‌ చేయబోయాడు. బ్యాటు అంచుకు తగిలిన బంతి కీపర్‌ బట్లర్‌ చేతుల్లో పడింది. అండర్సన్‌ వేసిన 4.1వ బంతికి చేతేశ్వర్ పుజారా (1; 9 బంతుల్లో) బలయ్యాడు.

అండర్సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 10.5 ఓవర్‌కు విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాడు. కోహ్లీ కీపర్‌ బట్లర్‌కి క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో అండర్సన్‌ను ఎదుర్కోవడంలో కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. సరిగ్గా చెప్పాలంటే కోహ్లీ సెంచరీ చేసి దాదాపు 630 రోజులు అయింది. ఈరోజు 7 పరుగులకే ఔట్ అవ్వడంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

71 సెంచరీ చేయడం కలనే

సోషల్ మీడియా వేదికగా విరాట్ కోహ్లీపై ఫాన్స్ మండిపడుతున్నారు. మరికొందరు ట్వీట్ల వర్షం కురిపిస్తుంటే.. మరికొందరు మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. 'విరాట్ కోహ్లీ 71 సెంచరీ చేయడం అభిమానులకు ఓ కలగా మిగిలిపోనుంది' అని ఓ అభిమాని కామెంట్ చేయగా... 'విరాట్ కోహ్లీ ఇక రిటైర్మెంట్ ఇచ్చే సమయం వచ్చేసింది' అని మరో అభిమాని కామెంట్ చేశాడు. 'జేమ్స్ అండ‌ర్స‌న్ గ్రేట్', 'లే అనుష్క.. ఇంకో ఆటలో చూసుకుందాం', 'జో రూట్ మరియు విరాట్ కోహ్లీ మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే' ' అబ్బా.. తృటిలో సెంచరీ మిస్ అయిందిరా నాయనా', 'సెంచరీకి 93 పరుగులే తక్కువ చేశాడు కోహ్లీ' అని ఫాన్స్ సెటైర్లు వేస్తున్నారు.

2019లో చివరి సెంచరీ

విరాట్ కోహ్లీ గత ఏడాదిన్నర కాలంగా బ్యాటింగ్​లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. 2019 నవంబర్​లో బంగ్లాదేశ్​పై చివరిసారిగా సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కొన్నిసార్లు మాత్రమే 70, అంతకుమించిన పరుగులు చేశాడు. టెస్టులు, వన్డేల్లో కలిపి ఇప్పటికే 70 శతకాలు సాధించిన కోహ్లీ.. ఇటీవల ముగిసిన టెస్ట్​ ఛాంపియన్​షిఫ్​ ఫైనల్​లోనూ పూర్తిగా విఫలమయ్యాడు.

ఇంగ్లండ్‌తో ప్రారంభం అయిన టెస్ట్ సిరీస్​లోనైనా 71వ శతకం అందుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అభిమానుల ఆశలను వమ్ము చేస్తూనే ఉన్నాడు. 2008లో క్రికెట్​లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఏడాది శతకం సాధిస్తూ వచ్చిన ​కోహ్లీ.. 2020లో మాత్రమే మూడెంకల స్కోరు అందుకోలేకపోయాడు.

70 సెంచరీలు.. 23 వేల పరుగులు

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ (తొలి టెస్ట్ ముందు వరకు) 94 టెస్టులాడి 51.4 సగటుతో 7609 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 254 వన్డేల్లో 59.1 సగటుతో 12169 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 90 టీ20లలో 52.6 సగటుతో 3159 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 23 వేల పరుగులు చేశాడు.

Story first published: Wednesday, August 25, 2021, 17:28 [IST]
Other articles published on Aug 25, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+