IND vs ENG Test: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జూన్ 20న లీడ్స్లో ప్రారంభం కానుంది. ఈ సారి యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఇంగ్లాండ్ గడ్డపై సవాలుకు సిద్ధమవుతోంది. దీని కోసం టీమిండియా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఆగస్టు వరకు సాగే ఈ సుదీర్ఘ సిరీస్ ఇరు జట్లకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త చక్రానికి నాంది పలకనుంది.
డేల్ స్టెయిన్ అంచనా.. ఇంగ్లాండ్దే సిరీస్!
శనివారం జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి దక్షిణాఫ్రికా తొలిసారి టైటిల్ గెలుచుకుంది. ఈ సందర్భంగా జియో హాట్స్టార్లో మాట్లాడిన దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం డేల్ స్టెయిన్.. భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్పై తన అంచనాలను వెల్లడించాడు. "అన్ని మ్యాచ్లు దగ్గరగా ఉంటాయి. కానీ అన్నింటికీ ఫలితం ఉంటుంది. ఇంగ్లాండ్ ఈ సిరీస్ను 3-2తో గెలుస్తుందని నేను భావిస్తున్నాను. ప్రతి టెస్ట్ మ్యాచ్కు ఫలితం ఉంటుంది. ఏ జట్టు సులభంగా గెలవదు. ఐదు మ్యాచ్లు చాలా దగ్గరగా ఉంటాయి." అని డేల్ స్టెయిన్ చెప్పాడు. ఇంగ్లాండ్కు ఈ సిరీస్లో పైచేయి ఉంటుందని డేల్ స్టెయిన్ భావిస్తున్నాడు.

స్వదేశంలో ఇంగ్లాండ్కు అద్భుతమైన రికార్డు
ఈ సారి టీమిండియా దిగ్గజ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా ఇంగ్లాండ్లో ఆడబోతోంది. సిరీస్కు ముందే ఈ ఇద్దరు భారత దిగ్గజాలు టెస్ట్ క్రికెట్కు రిటైర్ అవ్వడంతో యువ టీమిండియాకు ఇది ఒక అగ్నిపరీక్ష కానుంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు తమ స్వదేశంలో బలమైన రికార్డును కలిగి ఉంది. కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ స్వదేశంలో ఆడిన 20 టెస్ట్ మ్యాచ్లలో 15 మ్యాచ్లు గెలిచి, కేవలం 4 ఓటములు, ఒక డ్రాతో 75 శాతం విజయాల శాతాన్ని నమోదు చేసింది. అయితే ఇంగ్లాండ్ జట్టు భారత యువ ఆటగాళ్లను తక్కువ అంచనా వేయాలనుకోవడం లేదు. ఎందుకంటే వారికి కూడా ఇంగ్లాండ్లో గెలిచే సత్తా ఉంది.
కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ఆధ్వర్యంలో, ఇంగ్లాండ్ స్వదేశంలో ఆడిన 20 టెస్ట్ మ్యాచ్లలో 15 మ్యాచ్లు గెలిచి, కేవలం 4 ఓటములు, ఒక డ్రాతో 75% విజయాల శాతాన్ని నమోదు చేసింది. అయితే, ఇంగ్లాండ్ జట్టు భారత యువ ఆటగాళ్లను తక్కువ అంచనా వేయాలనుకోవడం లేదు, ఎందుకంటే వారికి కూడా ఇంగ్లాండ్లో గెలిచే సత్తా ఉంది.