ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా థ్ల్రిల్లింగ్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు మ్యాచుల సిరీస్లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది భారత జట్టు. మూడో మ్యాచ్ గుజరాత్లోని రాజ్కోట్ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ కొత్త అవతారం ఎత్తాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
మూడో టీ20 మ్యాచ్ కు ముందు అక్షర్ పటేల్ వ్లాగర్ గా మారాడు. దీనినే బీసీసీఐ షేర్ చేసింది. ఈ వీడియోలో భారత ప్లేయర్లు చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి మూడో మ్యాచ్ వేదికైన రాజ్ కోట్ హోటల్ వరకు చేసిన జర్నీని చూపించారు. ఇంకా ఇందులో అక్షర్ పటేల్ తన టీమ్ మేట్స్, కోచింగ్ స్టాఫ్ తో సంభాషించడం, టీమ్ బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కిల్, ఆల్ రౌండర్స్ రమన్ దీప్ సింగ్, హార్దిక్ పాండ్య, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తో మాట్లాడటం వంటివి కనిపించింది.

మూడో టీ20కి భారత తుది జట్టు(అంచనా):
సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్.