For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: చెత్త బౌలింగ్ ఆరోపణలు.. మోర్నేమోర్కెల్ కౌంటర్!

IND vs ENG: ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు భారీగా పరుగులు సాధిస్తూ భారత్‌కు సవాలు విసురుతోంది. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 186 పరుగులకు చేరింది. భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ, ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు అది బ్యాటింగ్ పిచ్‌గా మారడం పట్ల అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. దీనికి భారత బౌలర్ల పేలవ ప్రదర్శన, వాతావరణ మార్పులే కారణమని క్రికెట్ నిపుణులు ఆరోపించారు.

మాంచెస్టర్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత బౌలింగ్ ప్రదర్శనపై భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ స్పందించారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి కీలక బౌలర్లకు గాయాల బెడద ఉన్నప్పటికీ, జట్టు తమ శక్తి మేరకు బాగానే బౌలింగ్ చేసిందని ఆయన పేర్కొన్నారు. రెండో రోజు ఆటతో పోలిస్తే, మూడో రోజు ఆటలో మా బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారని.. వారు పెద్దగా పరుగులు ఇవ్వలేదని ఆయన అన్నారు. అయితే ఇలాంటి పిచ్‌లపై నిరంతరం బౌలింగ్ చేయడానికి చాలా శక్తి అవసరమని మోర్నె మోర్కెల్ స్పష్టం చేశారు.

IND vs ENG Morne Morkel Responds to Criticism Over India s Bowling Performance in 4th Test

స్టార్ బౌలర్లకు గాయాలు
భారత జట్టులోని ఇద్దరు స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ గాయాలతో బాధపడుతున్నారని మోర్నే మోర్కెల్ వెల్లడించారు. బుమ్రా, సిరాజ్ ఇద్దరూ తమ కాళ్ల నొప్పితో బాధపడుతున్నారని పేర్కొన్నారు. వారికి నొప్పి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇద్దరూ మంచి శారీరక ఫిట్‌నెస్‌తోనే ఉన్నారని ఆయన తెలిపారు. నిజానికి మూడో రోజు బుమ్రా చీలమండ నొప్పితో మైదానాన్ని విడిచిపెట్టాడు. అయితే తర్వాత తిరిగి వచ్చాడు. సిరాజ్ కూడా తన ఓవర్లోల అసౌకర్యాన్ని అనుభవించి కొంతకాలం మైదానం నుంచి వెళ్లిపోయాడు.

జట్టు కూర్పు, బౌలింగ్ వ్యూహాలు
మోర్నే మోర్కెల్ బౌలింగ్ కూర్పు గురించి మాట్లాడుతూ.. పిచ్‌పై ఖచ్చితంగా నిరంతరం బౌలింగ్ చేయగల ఆటగాడు అవసరమని, అందుకే అన్షుల్ కాంబోజ్‌ను ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఇప్పటికే ఉన్నప్పుడు నాలుగో బౌలర్‌కు అదనపు పని భారం ఇవ్వడం సాధ్యం కాదని ఆయన వివరించారు. శార్దూల్ ఠాకూర్ 5 ఓవర్లకు మించి బౌలింగ్ చేయలేకపోవడానికి ఇదే కారణం కావచ్చునని మోర్నే మోర్కెల్ అభిప్రాయపడ్డారు.

అలాగే, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫాస్ట్ బౌలర్లను ఎక్కువగా ఉపయోగించాలని భావించినందున వాషింగ్టన్ సుందర్‌ను ఆలస్యంగా బౌలింగ్‌కు దించి ఉండవచ్చునని మోర్కెల్ పేర్కొన్నారు. బ్యాటింగ్ బలాన్ని పెంచే ఉద్దేశ్యంతోనే కుల్దీప్ యాదవ్‌ను జట్టులో చేర్చుకోలేకపోయారని ఆయన వివరించారు. ఈ వ్యాఖ్యలు భారత బౌలర్ల పనిభారం, గాయాలు, వ్యూహాత్మక ఎంపికల మధ్య సమతుల్యత సాధించడంలో జట్టు ఎదుర్కొంటున్న సవాళ్లను స్పష్టం చేస్తాయి.

Story first published: Saturday, July 26, 2025, 10:09 [IST]
Other articles published on Jul 26, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+