For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: 141 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో తొలిసారి.. మ్యాచ్ డ్రా అవుతుందా?

IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇరు జట్లు తమ తొలి ఇన్నింగ్స్‌లో తలా 387 పరుగులు చేసి ఔటయ్యాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఇన్నింగ్స్ స్కోరు సమం కావడం ఇది తొమ్మిదోసారి. దీని కారణంగా ఈ మ్యాచ్ డ్రా అవుతుందా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. దీనికి ముందు ఇలాగే జరిగిన 8 మ్యాచ్‌ల ఫలితం ఏమైందనేది ఇప్పుడు చూద్దాం.

ఎలా స్కోరు సమం అయింది?
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు జో రూట్ సెంచరీ, జామీ స్మిత్, బ్రైడన్ కార్స్ అర్థసెంచరీల సహాయంతో 387 పరుగులు చేసింది. భారత జట్టు తరఫున అద్భుతంగా బౌలింగ్ చేసిన జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసి లార్డ్స్ మైదానం రికార్డుల పట్టికలో తన పేరును నమోదు చేసుకున్నాడు. దీని తర్వాత బరిలోకి దిగిన భారత జట్టు.. ప్రారంభంలో కాస్త తడబడినప్పటికీ కేఎల్ రాహుల్ సెంచరీ, రిషబ్ పంత్ సాధించిన 74 పరుగులు, రవీంద్ర జడేజా అద్భుతమై 72 పరుగుల అర్థ సెంచరీలతో పతనం నుంచి కోలుకుంది.

IND vs ENG Lord s Test Tied After First Innings Will History Point to a Draw

ముఖ్యంగా నాలుగో వికెట్‌కు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ 141 పరుగులు జోడించి భారత జట్టుకు పటిష్టమైన పునాది వేసింది. దిగువ వరుస బ్యాటర్ అయిన నితీష్ కుమార్ రెడ్డి 30 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 23 పరుగులు చేసి అందించిన సహకారంతో భారత జట్టు ఇంగ్లాండ్ స్కోరును సమం చేసింది. దీని ద్వారా 141 సంవత్సరాల లార్డ్స్ మైదానం చరిత్రలో మొదటిసారిగా ఒక టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ స్కోరు సమంగా ముగిసింది.

చరిత్ర ఏం చెబుతోంది?
టెస్ట్ క్రికెట్‌లో దీనికి ముందు 8 సార్లు తొలి ఇన్నింగ్స్ స్కోర్లు సమం అయ్యాయి. ఇందులో నాలుగు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ముఖ్యంగా ఎక్కువ స్కోర్లు సాధించి సమం అయిన నాలుగు మ్యాచ్‌లు కూడా డ్రాగానే ముగిశాయి. 1973లో న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు 402 పరుగులు చేసి సమం చేయగా.. అదే సంవత్సరంలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లు 428 పరుగులు చేసి సమం చేసిన మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 1986లో భారత్, ఇంగ్లాండ్ జట్లు 390 పరుగులు చేసిన మ్యాచ్ డ్రా అయ్యింది. 1994లో ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు 593 పరుగులు సాధించిన మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది.

వీటిలో ఐదో అత్యధిక స్కోరుతో తొలి ఇన్నింగ్స్ సమం అయిన మ్యాచ్‌గా ప్రస్తుతం జరుగుతున్న భారత్ - ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ నిలిచింది. అందువల్ల ఈ మ్యాచ్ కూడా డ్రా అవుతుందా? అనే ప్రశ్న ఉంది. ఈ 5 మ్యాచ్‌లు కాకుండా తక్కువ స్కోరుతో సమం అయిన మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో.. 3 మ్యాచ్‌లలో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు ఓడిపోగా.. ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. 1958లో వెస్టిండీస్‌తో కాన్పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 222 పరుగులు చేసి సమం చేసినప్పటికీ చివరికి ఓడిపోయింది. కాబట్టి రెండోసారి బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు ఓడిపోతుందా? అనే అభిప్రాయం కూడా ఉంది.

ప్రస్తుతం లార్డ్స్ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 2 పరుగులు చేసింది. మ్యాచ్ సమంగా ఉండటంతో తదుపరి రెండు రోజుల ఆట చాలా కీలకం కానుంది. పిచ్ స్వభావం, ఇరు జట్ల బౌలింగ్, బ్యాటింగ్ పైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. అయితే ఎక్కువ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ సమం అయి ఉన్నందున.. ఈ మ్యాచ్ డ్రాగా ముగియడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది.

Story first published: Sunday, July 13, 2025, 11:23 [IST]
Other articles published on Jul 13, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+