IND vs ENG: భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ బర్మింగ్హామ్ టెస్ట్ మ్యాచ్ గెలిచి చరిత్ర సృష్టించాడు. ఎడ్జ్బాస్టన్ మైదానంలో టెస్ట్ మ్యాచ్ గెలిచిన మొదటి ఆసియా కెప్టెన్గా శుభ్మన్ గిల్ నిలిచాడు. అయితే దీని తర్వాత కూడా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇంకా పూర్తిగా సంతోషంగా లేడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇప్పుడు సిరీస్లోని మూడో టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా లార్డ్స్ టెస్ట్ మ్యాచ్లో ఈ గెలిచిన జట్టుతో బరిలోకి దిగడం లేదని శుభ్మన్ గిల్ స్పష్టం చేశాడు. ప్లేయింగ్ 11లో మార్పులను శుభ్మన్ గిల్ ఇప్పుడే ప్రకటించాడు.
బర్మింగ్హామ్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 336 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ వేడుకలో ఒక బౌలర్ను ప్రశంసించాడు. శుభ్మన్ గిల్ మాట్లాడుతూ.."మొదటి మ్యాచ్ తర్వాత మేము ఏవైతే చర్చించుకున్నామో అవన్నీ సరిగ్గా ఉన్నాయి. మా బౌలింగ్, ఫీల్డింగ్ అద్భుతంగా ఉన్నాయి. ఈ తరహా వికెట్పై 400-500 పరుగులు చేయగలిగితే మ్యాచ్ నిలబడగలమని మాకు తెలుసు. ప్రతిసారీ మనం అన్ని క్యాచ్లను వదిలేయం. ఆకాశ్ దీప్ చాలా నిబద్ధతతో బౌలింగ్ చేశాడు. ఆకాశ్ దీప్ బంతిని రెండు వైపులా తిప్పుతూ.. సరైన ప్రాంతంలో, సరైన నిడివిలో వేశాడు. ఇలాంటి వికెట్పై అలా చేయడం కష్టం." అని శుభ్మన్ గిల్ అన్నాడు.

ప్లేయింగ్ 11లో మార్పులు చేయనున్న శుభ్మన్ గిల్
సిరీస్లోని మూడో టెస్ట్ మ్యాచ్ జులై 10 నుంచి లార్డ్స్లో జరుగుతుంది. అక్కడ జట్టులో మార్పులపై కెప్టెన్ శుభమన్ గిల్ మాట్లాడుతూ.. "నేను నా ఆటతో సౌకర్యంగా ఉన్నానని చెబుతాను. నా సహకారంతో సిరీస్ గెలిస్తే నేను సంతోషిస్తాను. నేను ఇంతకు ముందే చెప్పాను, ఒక బ్యాటర్గా ఆడాలని, ఒక బ్యాటర్గా ఆలోచించాలని కోరుకుంటున్నాను. కచ్చితంగా బుమ్రా లార్డ్స్లో తిరిగి వస్తాడు. దాని కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాను. బహుశా అది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన స్టేడియం. ప్రతి ఆటగాడు చిన్నతనంలో అక్కడ ఆడాలని కలలు కంటారు" అని పేర్కొన్నాడు.