IND vs ENG: భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్ కంచుకోటగా భావించే బర్మింగ్హామ్లో టీమిండియా తొలిసారిగా ఇంగ్లండ్ జట్టును ఓడించింది. గతంలో ఈ వేదికపై ఇంగ్లండ్ జట్టుపై 8 టెస్టులు ఆడగా.. 7 మ్యాచ్ల్లో ఓటమిని చవిచూసింది. 1967 తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ జట్టును వారి సొంతగడ్డపై ఓడించడం ఇదే తొలిసారి. 58 ఏళ్ల నిరీక్షణ ఇప్పుడు ఫలించింది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడంలో ఐదుగురు ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు.
అతిపెద్ద హీరో.. ఆకాశ్ దీప్
టీమిండియా విజయంలో ఆకాశ్ దీప్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో ఆకాశ్ దీప్ మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు సాధించాడు. బౌలర్లకు ఎటువంటి సహాయం లభించని పిచ్పై ఆకాశ్ దీప్ రెండు ఇన్నింగ్స్లలోనూ ఇంగ్లండ్ జట్టును కంగారు పెట్టాడు.

శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ అదుర్స్
ఈ మ్యాచ్లో బ్యాటర్గా శుభ్మన్ గిల్ అత్యంత విజయవంతమైన ఆటగాడిగా నిలిచాడు. శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 269 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్లో భారత కెప్టెన్గా ఇదే శుభ్మన్ గిల్ అత్యధిక స్కోరు. ఇక రెండో ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ 161 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీనితో శుభ్మన్ గిల్ ఒకే మ్యాచ్లో 500 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు.
మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన
టీమిండియా విజయంలో మహ్మద్ సిరాజ్ కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో భారత బౌలింగ్ విభాగానికి మహ్మద్ సిరాజ్ నాయకత్వం వహించాడు. సిరాజ్ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లు సాధించాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో ఒక వికెట్ పడగొట్టాడు. సిరాజ్ తొలి ఇన్నింగ్స్లో తీసిన 6 వికెట్ల కారణంగానే టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది.
అదరగొట్టిన రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా కూడా ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా బ్యాట్తో రవీంద్ర జడేజా అదరగొట్టాడు. రవీంద్ర జడేజా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 89 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో కూడా రవీంద్ర జడేజా 69 పరుగులు చేశాడు. దీనితో టీమిండియాకు రెండు ఇన్నింగ్స్లలోనూ భారీ స్కోర్లు సాధించడంలో సహాయపడింది.
మరోసారి ఆదుకున్న యశస్వి జైస్వాల్
రెండో టెస్టు ప్రారంభంలో మరోసారి యశస్వి జైస్వాల్ టీమిండియా కీలక పాత్ర పోషించాడు. యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 87 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అయితే తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 28 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ కూడా చాలా వేగంగా సాగింది.