
టోప్లీ ప్రతాపానికి ఇండియా బ్యాటర్లు పెవిలియన్కు క్యూ
టోప్లీ ప్రతాపానికి ఇండియా టాపార్డర్, లోయర్ ఆర్డర్ కుప్పకూలింది. అతను టాపార్డర్లో తొలుత రోహిత్ శర్మ (0), శిఖర్ ధావన్ (9), సూర్యకుమార్ యాదవ్ (27)లను ఔట్ చేశాడు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్లో షమీ (23), చాహల్ (3), ప్రసీద్ క్రిష్ణ (0)లను ఔట్ చేశాడు. టోప్లీ బౌలింగ్ ధాటిగా పడడంతో ఇండియా బ్యాటర్లు అతన్ని సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. ఇక షమీని ఔట్ చేయడంతో ఇండియా ఓటమి ఖాయమైపోయింది. షమీకి స్లో టాస్ వేయగా హిట్ చేయాలని చూసి ఔటయిపోయాడు. అంతవరకు షమీ, జడేజా జోడి కాస్త ఇంగ్లాండ్ను ఎదుర్కునేలా కన్పించింది. కానీ షమీ ఔటయ్యాక, లివింగ్స్టన్ బౌలింగ్లో జడేజా (29పరుగులు 44బంతుల్లో) కూడా బౌల్డ్ అవ్వడంతో ఇండియా ఆశలు వదులుకుంది. ఇక మధ్యలో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (29) పోరాటం కనబర్చినా అది సరిపోలేదు.

ఎప్పటిలాగే నిరాశపర్చిన కోహ్లీ
క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ మూడు చూడచక్కని ఫోర్లు కొట్టి కాసేపు అలరించాడు. కానీ డేవిడ్ విల్లీ బౌలింగ్లో కోహ్లీ (16పరుగులు 25బంతుల్లో 3ఫోర్లు) కూడా ఎప్పటిలాగే వైడ్ ఆఫ్ స్టంప్ బాల్ను కవర్స్లో ఆడబోయే కట్ కీపర్ క్యాచ్ ఔటయ్యాడు. ఇక 31పరుగులకే 4వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడ్డది. ఇక తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు పడడంతో గెలుపు దూరమైంది. ఇంగ్లాండ్ బౌలర్లు పరిస్థితులను చక్కగా అవగాహన చేసుకున్నట్లు కన్పించింది. ఇక ఈ మ్యాచ్లో ఇండియా ఓటమితో సిరీస్ 1-1తేడాతో సమమైంది. సిరీస్ డిసైడర్ అయిన మూడో మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 3.30కు జరగనుంది.

తుది జట్లు :
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జానీ బెయిర్స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్/ కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్టన్, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్సే, రీస్ టోప్లీ
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ


Click it and Unblock the Notifications












