న్యూఢిల్లీ: ఇంగ్లాండుతో జరిగిన మూడు టెస్టు మ్యాచులు ఆడిన పార్థివ్ పటేల్ భారత జట్టులో స్థానం కోల్పోయాడు. చెప్పినట్లుగానే పార్థివ్ పటేల్కు షాక్ ఇచ్చారు. ఆయన స్థానంలో వృద్ధిమాన్ సాహాను బిసిసిఐ సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు.
బంగ్లాదేశ్తో జరిగే ఏకైక టెస్టు మ్యాచుకు ఎంపిక చేసిన జట్టును ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. అభినవ్ ముకుంద్కు టెస్టు జట్టులో స్థానం దక్కింది. తమిళనాడు కెప్టెన్ అయిన అతను ఇంత వరకు తన కెరీర్లో ఐదు టెస్టు మ్యాచులు ఆడాడు.
గాయం కారణంగా ఇంగ్లాండుతో జరిగిన టెస్టు మ్యాచుకు సాహా దూరమయ్యాడు. ఇంగ్లాండుతో జరిగిన మూడో టెస్టు మ్యాచులో గాయపడినన బౌలర్ మొహమ్మద్ షమీ కోలుకుంటున్నట్లు సమాచారం. అయితే, ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టు మ్యాచులను దృష్టిలో పెట్టుకుని అతనికి విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్తో ఫిబ్రవరి 9వ తేదీన టెస్టు మ్యాచు ప్రారంభమవుతుంది.
జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, కెఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహనే, వృద్ధిమాన్ సాహా, ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, కరుణ్ నాయర్, హార్దిక్ పాండ్యా, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, అభినవ్ ముకుంద్