లండన్: ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఈ ఏడాది జూలైలో ప్రారంభించాలనుకున్న 100 బంతుల ఫార్మాట్ 'ద హండ్రెడ్' టోర్నీకి బ్రేక్ పడింది. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో వచ్చే ఏడాదికి టోర్నీని వాయిదా వేస్తున్నట్టు ఈసీబీ గురువారం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కార్యకలాపాలు కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే.
సానియా మీర్జా అరుదైన ఘనత.. తొలి భారత ప్లేయర్గా రికార్డు!!
'ఈ ఏడాది నిర్వహించాలని భావిస్తున్న 'ద హండ్రెట్' టోర్నీని నిర్వహించే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. దీంతో మేం చాలా నిరాశకు లోనయ్యాం. కొత్త ఫార్మాట్ ఈ ఏడాది పరీక్షించకపోవడం బాధకరమే. ఈ సీజన్లో ముందు అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతున్నాం. వచ్చే ఏడాది ఈ టోర్నీని ఆవిష్కరిస్తామని భావిస్తున్నాం. 2021లో మనం సురక్షితంగా ఉన్న సమయంలో నిర్వహించాలని నిర్ణయించాం' అని ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హారిసన్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇరు జట్లకు చెరో 100 బంతులతో.. ఎనిమిది ఫ్రాంచైజీలతో ఈ మ్యాచ్ను నిర్వహించాలని ఈసీబీ బోర్డు భావించింది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా తొలుత ఈ టోర్నమెంట్ను ఖాళీ స్టేడియంలలో నిర్వహించాలని బోర్డు భావించింది. అయితే తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ టోర్నమెంట్ను వచ్చే ఏడాదికి వాయిదా వస్తున్నామని ఈసీబీ స్పష్టం చేసింది.
ఇక కరోనా వైరస్ కారణంగా వచ్చేనెల 28 వరకు క్రికెట్ యాక్టివిటీస్ను ఈసీబీ వాయిదా వేసింది. క్రికెట్ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమైతే.. కౌంటీతో సహా పలు మ్యాచ్లను నిర్వహించాల్సి ఈసీబీ ఉంది. ఈ నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. కరోనా కారణంగా ఇంగ్లండ్ ఇప్పటికే అన్ని సిరీస్లను వాయిదా వేసుకున్న విషయహం తెలిసిందే.