T20 World Cup 2022: లంక టార్గెట్ 145 పరుగులు.. 3 వికెట్లతో హసరంగ తీన్మార్..

టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా బ్రిస్బేన్ లో ఆఫ్ఘానిస్తాన్, శ్రీలంక మధ్య జరుగుతున్న సూపర్-12 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘానిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఆఫ్ఘాన్ ఓపెనర్ల లంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు చేశారు. వికెట్ కీపర్ రహ్మానుల్లా గుర్బాజ్ 24 బంతుల్లో 2 సిక్స్ లు, 2 ఫోర్లతో 28 పరుగులు చేశాడు.

ఉస్మాన్ ఘనీ
మరో ఓపెనర్ ఉస్మాన్ ఘనీ 27 బంతుల్లో ఒక సిక్స్, 2 ఫోర్లతో 27 పరుగులు చేశాడు. నజీబుల్లా జద్రాన్ 18 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లందరు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. కెప్టెన్ మహ్మద్ నబీ 13 పరుగులు చేశారు. లంక బౌలర్లలో హసరంగ మూడు వికెట్లు వికెట్లు తీయగా.. లాహిర్ కుమార 2 వికెట్లు పడగొట్టాడు. కసున్ రజిత, ధనుంజయ డిసిల్వ ఒక్కో వికెట్ తీశారు.

శ్రీలంక
గ్రూప్-1లో ఇప్పటికే ఈ జట్లు దాదాపు సెమీస్ కు వెళ్లే అవకాశాలను కోల్పోయాయి. గ్రూప్-1లో శ్రీలంక మూడు మ్యాచ్ లు ఆడి ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది. రెండింటిలో ఓడిపోయింది. శ్రీలంక 2 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఆఫ్ఘానిస్తాన్ మూడు మ్యాచ్ ల్లో ఒక మ్యాచు లో ఓడిపోగా.. మిగతా రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. దీంతో ఆ జట్టు 2 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది.

ఇంగ్లాండ్
గ్రూప్-1లో న్యూజిలాండ్ 5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మూడు పాయింట్లతో ఇంగ్లాండ్ మూడో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ తో పాటు శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో గెలిస్తే సెమీస్ అవకాశాలు ఉంటాయి. ఇంగ్లాండ్ రెండు మ్యాచ్ లు గెలిచి.. ఆస్ట్రేలియా ఆఫ్ఘానిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో ఓడిపోతే నేరుగా సెమీస్ వెళ్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications