
మ్యాచ్-1:
2013లో ఇంగ్లాండ్-స్కాట్లాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, స్కాట్లాండ్ కెప్టెన్ విలియమ్ పోర్ట్ ఫీల్డ్లు సెంచరీలతో మెరిశారు. తద్వారా తొలిసారి ఒకే వన్డేలో సెంచరీలు సాధించిన కెప్టెన్లుగా వీరిద్దరూ చరిత్ర సృష్టించారు.

మ్యాచ్-2:
2014లో బంగ్లాదేశ్-భారత జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్పికర్ రహీమ్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీలు సెంచరీలు నమోదు చేశారు. దీంతో ఏడాది వ్యవధిలోనే ఒకే మ్యాచ్లో ఇరు జట్ల కెప్టెన్లు సెంచరీలు సాధించిన ఘనతను వీరిద్దరూ సొంతం చేసుకున్నారు.

మ్యాచ్-3:
2014లో భారత్-శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్లు సెంచరీలు నమోదు చేశారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సొంత రాష్ట్రమైన జార్ఖండ్లోని రాంచీలో జరిగిన మ్యాచ్లో వీరిద్దరూ సెంచరీలు సాధించారు.

మ్యాచ్-4:
డర్బన్లోని కింగ్స్మీడ్ స్టేడియంలో జరిగిన వన్డేలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల తలపడ్డాయి. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్, టీమిండియా కెప్టెన్ కోహ్లీలు సెంచరీలతో రాణించారు. వన్డేల్లో డుప్లెసిస్కు ఇది తొమ్మిదో సెంచరీ కాగా, కోహ్లీకి 33వది కావడం విశేషం. ఈ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. అయితే, ఈ నాలుగు సందర్బాల్లో మూడుసార్లు విరాట్ కోహ్లీ భాగస్వామ్యం కావడం ఇక్కడ విశేషం.


Click it and Unblock the Notifications