For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో రికార్డు: అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా టీమిండియా

By Nageshwara Rao
In Stats: India Become Most Successful Team After 100 T20Is

హైదరాబాద్: టీ20ల్లో వరుస విజయాలతో దూసుకపోతున్న టీమిండియా మరో అరుదైన ఘనత సాధించింది. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా రెండు టీ20ల సిరిస్ కోసం ఐర్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.

డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 టీమిండియాకు 100వ అంతర్జాతీయ టీ20 అన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో 100వ టీ20 ఆడిన ఏడో జట్టుగా టీమిండియా నిలిచింది. ఐర్లాండ్‌తో ఆడిన 100వ టీ20లో 76 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

63కు చేరిన టీమిండియా విజయాల సంఖ్య

63కు చేరిన టీమిండియా విజయాల సంఖ్య

దాంతో టీ20ల్లో టీమిండియా విజయాల సంఖ్య 63 ‍కు చేరింది. ఫలితంగా ఒక అంతర్జాతీయ జట్టు 100 టీ20లు ఆడే సమయానికి అత్యధిక విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా టీమిండియా అరుదైన రికార్డుని నెలకొల్పింది. టీమిండియా తర్వాత ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానాలలో వరుసగా దక్షిణాఫ్రికా(59), పాకిస్తాన్ (‌59), ఆస్ట్రేలియా(53), శ్రీలంక (52), న్యూజిలాండ్‌(52), ఇంగ్లండ్‌(48) జట్లు ఉన్నాయి.

160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ధావన్-రోహిత్ శర్మ

160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ధావన్-రోహిత్ శర్మ

ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు తొలి వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీ20ల్లో ఐర్లాండ్‌పై ఓ జట్టు నెలకొల్పిన అత్యధిక భాగస్వామ్యం ఇదే కావడం విశేషం. తర్వాత కెనడాకు చెందిన ఓపెనర్లు గుణశేఖర, బాగాయ్ నెలకొల్పిన 125 పరుగుల భాగస్వామ్యం రెండో స్థానంలో ఉంది.

1000కిపైగా పరుగులు నమోదు చేసిన రెండవ ఓపెనింగ్ జోడీ

1000కిపైగా పరుగులు నమోదు చేసిన రెండవ ఓపెనింగ్ జోడీ

అదే సమయంలో ధావన్-రోహిత్ శర్మల జోడి మరో రికార్డుని కూడా నమోదు చేసింది. టీ20ల్లో 1000కిపైగా పరుగులు నమోదు చేసిన రెండవ ఓపెనింగ్ జోడీగా ధావన్-రోహిత్ శర్మల జోడీ నిలిచింది. టీ20ల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఓపెనింగ్ జోడీగా డేవిడ్ వార్నర్-షేన్ వాట్సన్‌లు ఉన్నారు.

 34 ఇన్నింగ్స్‌ల్లో 1103 పరుగులు చేసిన ధావన్-రోహిత్ జోడీ

34 ఇన్నింగ్స్‌ల్లో 1103 పరుగులు చేసిన ధావన్-రోహిత్ జోడీ

ఈ జోడీ 32 ఇన్నింగ్స్‌ల్లో 1108 పరుగులు చేశారు. కాగా, ధావన్-రోహిత్ శర్మల జోడీ 34 ఇన్నింగ్స్‌ల్లో 1103 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. వీరి తర్వాత న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గుప్టిల్-కేన్ విలియమ్సన్‌ల జోడీ 18 ఇన్నింగ్స్‌ల్లో 870 పరుగులు చేసి మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

Story first published: Friday, June 29, 2018, 14:51 [IST]
Other articles published on Jun 29, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+