ఏదైనా ట్వీట్ కానీ, పోస్టు కానీ పెడతా:
అతనేం మాట్లాడినా నెటిజన్లు మాట్లాడుకోవడానికి ఒక విషయం దొరికేసినట్లే. ఇటీవలే ఆసియా కప్ ముగిసిన నేపథ్యంలో రవిశాస్త్రిని అక్కడి మీడియా ఇంటర్వ్యూ చేసింది. ఆ సందర్భంగా మాట్లాడిన రవిశాస్త్రి.. తనకు అస్సలు ఈ సోషల్ మీడియా గురించి పట్టించుకునే సమయమే ఉండదని చెప్పుకొచ్చాడు. తనకు సమయం దొరికినప్పుడు కేవలం ఒకట్రెండు వార్తా పత్రికలు చదువుతానని తెలిపాడు. ఇంకా సమయముంటే తానే ఏదైనా ట్వీట్ కానీ, పోస్టు కానీ పెడతాడు గానీ, వేరే వాళ్లవి చదివేంత తీరిక ఉండదని వివరించాడు.
అస్సలు పట్టించుకోను.. రోజూ తీరిక లేకుండా
'నేను అస్సలు పట్టించుకోను. నా పనిలో భాగంగా రోజూ తీరిక లేకుండా గడుపుతాను. ఎప్పుడో ఓ సారి ఒకట్రెండు పేపర్లు చదువుతాను. నాకంతే సమయముంటుంది. అంతకంటేమించి వేరేది చేసేంత గ్యాప్ ఉండదు. ఇక ప్రముఖ సోషల్ మీడియాలు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో ట్వీట్ నేనే చేస్తాను. వాటికి బదులు ఏం వచ్చిందోనని చదువుకునేంత తీరిక ఉండదు' అంటూ స్పష్టం చేశాడు.
వాళ్ల వాదనలన్నీ వినాల్సిన అవసర్లే
'ఎవరైనా ఏదైనా వాగితే అది వాళ్లకే వదిలేస్తా. నీపై నీకు నమ్మకముంటే వాళ్ల వాదనలన్నీ వినాల్సిన అవసర్లేదు. నీ వల్ల అయినంత వరకూ అంటే వంద శాతం కష్టపడుతున్నానని నువ్వు అనుకుంటే మిగిలిన వాళ్ల మాటలు పట్టించుకునే పనిలేదు. ఒకవేళ అవన్నీ పట్టించుకోవడం మొదలుపెట్టావంటే నీ జీవితంలో చాలా పరిస్థితులను మిస్సయిపోతావు. అందుకే చెప్తున్నా మరిచిపోవడం మహదానందంగా ఉంటుంది'
ఆస్ట్రేలియాలో 3వన్డేలు, 4 టెస్టులు, 3 టీ20ల్లో:
ఆసియా కప్ విజయం తర్వాత రవిశాస్త్రి టీమిండియా మరో విదేశీ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా చుట్టేయనుంది. ఈ క్రమంలో జట్టుతో పాటుగా రవిశాస్త్రి వెళ్తాడా అనేది నిర్ణయించే క్రమంలో బోర్డు ఉన్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా పర్యటనలో 3వన్డేలు, 4 టెస్టులు, 3 టీ20ల్లో భారత్ పాల్గొననుంది. అయితే ఈ పర్యటనలో విజయం సాధించడానికి తన ఫోకస్ను మారుస్తున్నానని హెడ్ కోచ్ తెలిపాడు.