For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ishant Sharma : విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటే అతని ప్లేస్‌కు ఢోకా లేదు.. పాపం దీపక్ హుడా?

If Virat Kohli is Available There is no Doubt about His spot in Playing 11 says Ishant sharma

ఇంగ్లాండ్‌తో జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌కు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటే అతను కచ్చితంగా తుది జట్టులో ఉంటాడని వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ఇక దీపక్ హుడా మొదటి టీ20లో నంబర్ 3 ప్లేస్‌లో రాణించినప్పటికీ.. అతనికి అవకాశం దక్కడం కష్టమేనని పేర్కొన్నాడు. ఇక తొలి టీ20లో టీమిండియా.. ఇంగ్లాండ్‌ను 50 పరుగుల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. ఇక మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని రెండో మ్యాచ్ జూలై 9న (నేడు) బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకోవాలని టీమిండియా చూస్తుండగా.. ఎలాగైన గెలిచి సిరీస్లో కొనసాగాలని ఇంగ్లాండ్ భావిస్తోంది.

దీపక్ హుడాకు ఛాన్స్ కష్టమే

దీపక్ హుడాకు ఛాన్స్ కష్టమే

ఇషాంత్.. జతిన్ సప్రూ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. 'దీపక్ హుడాకు తుది జట్టులో చోటు దక్కడం కష్టమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే విరాట్ కోహ్లీ నంబర్ 3లో తప్పకుండా ఆడతాడు. కోహ్లీ అందుబాటులో ఉంటే అతను ఆడకపోవడం అంటూ ఉండదు. అతన్ని బెంచ్‌కు పరిమితం చేయడం కుదరని పని. ఇదే నిజం' అని ఇషాంత్ దీపక్ హుడాకు ఛాన్స్ దక్కే అవకాశాలు లేవని స్పష్టం చేశాడు.

హార్దిక్, దినేష్ లాగే రవీంద్రా జడేజా కూడా..

హార్దిక్, దినేష్ లాగే రవీంద్రా జడేజా కూడా..

ఇక తొలి మ్యాచ్‌లో ఆడిన అక్షర్ పటేల్ స్థానంలో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తుది జట్టులోకి వస్తాడని ఇషాంత్ అన్నాడు. 'అక్షర్ పటేల్ స్థానంలో రవీంద్ర జడేజా ప్లేయింగ్ 11లోకి రావాలి. అతను హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ లాగా బంతిని హిట్ చేసే ప్లేయర్.' అని పేర్కొన్నాడు. ఇక ఇటీవల రీషెడ్యూల్డ్ చేసిన అయిదో టెస్టులో రవీంద్రా జడేజా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే.

శ్రేయస్ కన్నా సూర్యకుమార్ యాదవే బెటర్

శ్రేయస్ కన్నా సూర్యకుమార్ యాదవే బెటర్

ఇక నంబర్ 4 స్థానం గురించి మాట్లాడుతూ.. 'సూర్యకుమార్ యాదవ్ మిగిలిన రెండు మ్యాచ్‌లకు తుది జట్టులో ఉంటాడనుకుంటున్నా. శ్రేయాస్ అయ్యర్ కంటే 4వ స్థానంలో ఆడ్డానికి సూర్యనే బెటర్ అని నేను భావిస్తున్నాను. ఇక మొత్తంగా తుది జట్టులోకి అయిదుగురు ఇన్‌కమింగ్ ప్లేయర్లు రావొచ్చు.' అని ఇషాంత్ అభిప్రాయపడ్డాడు. ఇక తొలి టీ20లో సూర్య 39పరుగులతో రాణించి.. జట్టుకు మిడిల్ ఓవర్లలో మంచి స్కోరు అందించాడు.

 2వ, 3వ టీ20లకు భారత జట్టు:

2వ, 3వ టీ20లకు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్

Story first published: Saturday, July 9, 2022, 15:26 [IST]
Other articles published on Jul 9, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+