ఇతర క్రికెట్ దేశాల్లో ఇస్తున్నట్లుగా
ఇతర క్రికెట్ దేశాల్లో ఇస్తున్నట్లుగా భారత క్రికెట్ బోర్డుకు ప్రత్యేకంగా భారత ప్రభుత్వం ఐసీసీ మెగా ఈవెంట్లకు మినహాయింపు ఇవ్వడం లేదు. దీంతో పన్ను మినహాయింపు అదనపు భారాన్ని మోసేందుకు తమ స్పాన్సర్లతో బీసీసీఐ చర్చలు జరుపుకోవాలని ఆదివారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ముందస్తుగా సూచించారు.
బీసీసీఐ విజ్ఞప్తిని తొసిపుచ్చిన ఐసీసీ
దీంతో పాటు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలతో క్రికెట్ సంబంధాలు నిలిపివేయాలని బీసీసీఐ చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తోసిపుచ్చింది. ఉగ్రవాద సంబంధ అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదని ఐసీసీ స్పష్టం చేసింది.
బీసీసీఐ రాసిన లేఖపై స్పందించిన ఐసీసీ
గత నెలలో జరిగిన పుల్వా మా ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాడికి కారణమైన వారిని క్రికెట్ నుంచి బహిష్కరించాలని, వారితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దంటూ బీసీసీఐ రాసిన లేఖకు ఐసీసీ తాజాగా స్పందించింది.
పాక్పై బహిష్కరణ వేటు వేయలేం
"జరిగిన ఉదంతాన్ని కారణంగా చూపుతూ సభ్య దేశంపై బహిష్కరణ వేటు వేయలేం. ఓ దేశాన్ని వెలివేయడమనేది ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయమని, అందులో ఐసీసీ పాత్రేమీ ఉండదని ఛైర్మన్ శశాంక్ మనోహర్ స్పష్టం చేశారు. ఈ విషయం బీసీసీఐకి కూడా తెలుసు" అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు.