
ఆ మాటలు నన్ను ఎంతగానో బాధించాయి
"కానీ, బయటివారు మాటలు నన్ను ఎంతగానో బాధించాయి. తమిళనాడు తరఫున ఇదే అతడి చివరి మ్యాచ్. దీని తర్వాత ఇంకెప్పుడూ ఇక్కడ ఆడలేడు అని పలువురు క్రికెట్ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. దీంతో ఎలాగైనా జట్టులో స్థానం సంపాదించాలని చాలా కష్టపడ్డా" అని విజయ్ శంకర్ తన తొలి సంఘటనను గుర్తు చేసుకున్నాడు.

ఆ బంతికి ఔటై ఉండి ఉంటే
"ఈ మ్యాచ్లో గనుక ఆ బంతికి ఔటై ఉండి ఉంటే తమిళనాడు తరఫున అదే నా చివరి మ్యాచ్ అయ్యి ఉండేది. అయితే, నేను చేసిన 95 పరుగులే తర్వాత ఇండియా-ఏ జట్టుకి ఎంపికయ్యేలా చేశాయి. ఇక అక్కడి నుంచి నా కెరీరే పూర్తిగా మారిపోయింది" అని విజయ్ శంకర్ తెలిపాడు.

ఇంగ్లాండ్లో విజయ్ శంకర్
కాగా, ప్రస్తుతం విజయ్ శంకర్ ఇంగ్లాండ్లో ఉన్నాడు. మే30 నుంచి ఆరంభమయ్యే వన్డే వరల్డ్కప్లో టీమిండియా తరుపున ఎంపికైన 15 మంది జట్టు సభ్యుల్లో ఒకడు. కాగా, టోర్నీకి ముందు మే 25న న్యూజిలాండ్తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్లో గాయం కారణంగా విజయ్ శంకర్కు చోటు దక్కలేదు.

ముంబైతో చెన్నైలో జరిగిన మ్యాచ్లో
ఇక, రెండో సంఘటన విషయానికి వస్తే "ముంబైతో చెన్నైలో జరిగిన మ్యాచ్లో శార్దుల్ ఠాకుర్ వేసిన ఓ అద్భుతమైన బంతికి నేను బౌల్డ్ అయ్యా. కానీ, అది నోబాల్గా కావడంతో నేను బతికిపోయా. ఆ సమయంలో నేను ఐదు పరుగుల వద్ద ఉన్నాను. ఆ నోబాల్ తర్వాత 95 పరుగులు సాధించి గెలిపించాను" అని విజయ్ శంకర్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












