హైదరాబాద్: యువ వికెట్కీపర్ రిషభ్ పంత్ మైదానంలో ధోనీ నినాదాలు వినేందుకు అలవాటు పడాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. అభిమానులు చేస్తోన్న ఆ నినాదాలను వింటూనే వాటి ఒత్తిడి నుంచి బయటపడేందుకు మార్గం వెతకాలని దాదా సూచించాడు.
శుక్రవారం ఇండియా టుడే కాన్క్లేవ్ ఈస్ట్ 2019లో రిషబ్ పంత్ పేలవ ఫామ్పై సౌరవ్ గంగూలీ స్పందించాడు. గంగూలీ మాట్లాడుతూ "ఆ నినాదాలు పంత్కు మంచివే. వాటికి అతడు అవాటు పడాలి. అవి వింటూనే విజయవంతం అవ్వడానికి దారి కనుక్కోవాలి. ఒత్తిడిని ఎదుర్కొంటూనే అతడు క్రికెట్లో తన ముద్ర వేయాలి" అని అన్నాడు.
IPL 2020: ఢిల్లీ సహా యజమానిగా గంభీర్, 10శాతం వాటా విలువ రూ.100 కోట్లు!
"ప్రతిసారీ ధోనీ అందుబాటులో ఉండడు. భారత క్రికెట్లో ధోని సాధించినది పంత్ సాధించాలంటే 15 ఏళ్లు పడుతుంది. భారత్కు అతడు చేసిన సేవలకు బీసీసీఐ కేవలం ధన్యవాదాలు చెబితే సరిపోదు. ధోనీని ఎవరైనా గౌరవిస్తారు. భారత క్రికెట్కు ధోని చాలా చేశాడు. కేవలం థాంక్స్తో అతని సేవలకు ముగింపు చెప్పలేం" అని గంగూలీ అన్నాడు.
"రిటైర్మెంట్పై ధోనినే నిర్ణయం తీసుకుంటాడు. ధోని రిటైర్మెంట్పై చర్చలకు ముగింపు పలుకుదాం. దిగ్గజాలకు తగిన గౌరవం ఇవ్వాలి. అవును, అతడికి టచ్లోనే ఉన్నాం. మేము విరాట్ కోహ్లీతో కూడా మాట్లాడుతున్నాం. మేము సెలెక్టర్లతో మాట్లాడతాము. అది టీమిండియా క్రికెట్ అధికారులు, సెలక్షన్ కమిటీ చూసుకుంటుంది. ధోని రిటైర్మెంట్ అంశం ప్రస్తుతానికి అక్కడే ఉంది" దాదా అన్నాడు.