హైదరాబాద్: వరల్డ్కప్ సన్నాహాకంలో భాగంగా కోహ్లీసేన ప్రాక్టీస్ మ్యాచ్కి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా న్యూజిలాండ్తో తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. ఓవల్ వేదికగా శనివారం న్యూజిలాండ్తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మెగా టోర్నీలో జట్టులోని అన్ని స్థానాలకు ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ NO.4 స్థానంలో బ్యాటింగ్కు వచ్చే ఆటగాడిపై సందిగ్ధత నెలకొంది. ఈ మ్యాచ్లో ఆ స్థానం కోసం పలువురి ఆటగాళ్లను జట్టు మేనేజ్మెంట్ పరీక్షించనుంది. మరోవైపు రెండో ప్రాక్టీస్ మ్యాచ్ బంగ్లాదేశ్తో మే 28న జరగనుంది.
టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్లు జరగనున్నాయి. టోర్నీలో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా జూన్ 5న సౌతంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది. వరల్డ్కప్కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి.
జట్ల వివరాలు
టీమిండియా:
రోహిత్శర్మ, శిఖర్ధావన్, విరాట్కోహ్లీ(కెప్టెన్), విజయ్శంకర్, ధోనీ, హార్దిక్ పాండ్య, మహ్మద్ షమీ, బుమ్రా, కుల్దీప్యాదవ్, చాహల్, కేఎల్రాహుల్
న్యూజిలాండ్:
కొలిన్ మన్రో, మార్టిన్ గప్తిల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), టామ్బ్లండెల్, రాస్టేలర్, హెన్రీ నికోలస్, మిచెల్ శంట్నర్, ఫెర్గుసన్, ట్రెంట్బౌల్ట్, టిమ్సౌథీ, కొలిన్ డి గ్రాండమ్