ఆఫ్రిది ఆల్టైమ్ వరల్డ్కప్ జట్టిదే.. సచిన్, ధోనీలకు దక్కని చోటు

త్వరలో వరల్డ్కప్ ఉన్న నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ షాహిదీ ఆఫ్రిది తన ఆల్టైమ్ వరల్డ్కప్ జట్టును ప్రకటించాడు. ఆల్టైమ్ వరల్డ్కప్ జట్టులో ఏకంగా ఐదు మంది పాకిస్థాన్ ఆటగాళ్లకు ఆఫ్రిది చోటిచ్చాడు. పాకిస్థాన్ నుండి సయీద్ అన్వర్, ఇంజమామ్ ఉల్ హాక్, వసీం అక్రమ్, షోయబ్ అక్తర్, సక్లయిన్ ముస్తాక్లు ఉన్నారు.
పాకిస్థాన్ అనంతరం ఆసీస్ జట్టు నుండి నలుగురు ( గిల్క్రిస్ట్, రికీ పాంటింగ్, గ్లెన్ మెక్గ్రాత్, షేన్ వార్న్) ఆటగాళ్లను ఎంచుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికా నుండి జాక్వస్ కలిస్కు చోటు కల్పించాడు. అయితే భారత్ నుండి ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీని మాత్రమే ఎంపిక చేసుకున్నాడు. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్, భారత జట్టుకు వరల్డ్కప్ అందించిన ఎంఎస్ ధోనీలకు ఆఫ్రిది తన ఆల్టైమ్ వరల్డ్కప్ జట్టులో చోటు కల్పించలేదు. సచిన్, ధోనీలకు స్థానం కల్పించకపోవడంతో.. భారత అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

అఫ్రిది 'ఆల్టైమ్ వరల్డ్కప్ లెవన్' జట్టు:
సయీద్ అన్వర్, గిల్ క్రిస్ట్, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ, ఇంజమామ్ ఉల్ హక్, జాక్వస్ కలిస్, వసీం అక్రమ్, గ్లెన్ మెక్గ్రాత్, షేన్ వార్న్, షోయబ్ అక్తర్, సక్లయిన్ ముస్తాక్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications