హైదరాబాద్: మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా స్వల్ప తేడాతో ఓడడంతో రవీంద్ర జడేజాను ఓదార్చలేక పోయామని అతడి భార్య రివాబా తెలిపారు. ఈ మ్యాచ్లో 92/6తో జట్టు కష్టాల్లో పడినప్పుడు ధోని మద్దతుగా జడేజా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ క్రమంలో 59 బంతుల్లో 77 పరుగులు చేసి జట్టుని గెలుపు ముంగిట నిలబెట్టాడు. కానీ, హెన్రీ బౌలింగ్లో భారీషాట్ ఆడే క్రమంలో జడేజా ఔట్ కావడంతో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ అనంతరం జడేజాను ఓదార్చలేక పోయామని అతడి భార్య రివాబా అన్నారు.
ఈ పరాజయంతో జడేజా గుండె పగిలినంత పనైందని అతడి భార్య రివాబా చెప్పుకొచ్చారు. "సెమీస్లో ఓటమి తర్వాత జడ్డూను ఓదార్చలేకపోయాం. నేను అవుట్ కాకుండా ఉండుంటే తప్పకుండా గెలిచే వాళ్లమని పదేపదే చెబుతూ ఎంతో బాధపడ్డాడు. జడేజాను ఓదార్చడం మా వల్ల కాలేదు" అని ఆమె అన్నారు.