వికెట్లను తాకినా ఎల్ఈడీ బెయిల్స్
ఈ వరల్డ్కప్లో ఇప్పటికే పలు మ్యాచ్ల్లో బౌలర్ వేసిన బంతులు వికెట్లను తాకినా ఎల్ఈడీ బెయిల్స్ మాత్రం కింద పడక పోవడంపై సర్వత్రా చర్చ జరగుతున్నది. దీంతో నిబంధనల ప్రకారం బ్యాట్స్మన్ను ఔట్గా ప్రకటించడానికి వీలుండదు. దీనిపై భారత్, ఆస్ట్రేలియా జట్ల కెప్టెన్లు ఎల్ఈడీ బెయిల్స్పై అసంతృప్తి వ్యక్తం చేశారు.
బుమ్రా వేసిన మొదటి ఓవర్లో
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన మొదటి ఓవర్లో బంతి లెగ్ స్టంప్ వికెట్లను బలంగా తాకినా బెయిల్స్ పడకపోవడంతో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆరంభంలోనే ఔట్ కాకుండా తప్పించుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్ లో అతడు హాఫ్ సెంచరీతో చక్కటి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.
బెయిల్స్ మధ్యలో వైర్లు అమర్చడం వల్ల
దీంతో లైట్లు వెలిగేందుకు వీలుగా బెయిల్స్ మధ్యలో వైర్లు అమర్చడం వల్ల బరువు పెరిగి బెయిల్స్ పడటం లేదనే అభిప్రాయాలు ఎక్కువవుతున్నాయి. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు పది సందర్భాల్లో బెయిల్స్ ఇలా కింద పడకుండా బ్యాట్స్మెన్ను ఆదుకున్న సందర్భాలను అభిమానులు చూశారు.
గురువారం కివీస్తో మ్యాచ్
ఈ నేపథ్యంలో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ అనతంరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేశారు. కాగా, టోర్నీలో భాగంగా కోహ్లీసేన గురువారం వరుసగా మూడు విజయాలను నమోదు చేసిన న్యూజిలాండ్తో తలపడనుంది.