న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత మ్యాచ్‌లో అతి చేసిన బ్రాత్‌వైట్: ఐసీసీ జరిమానా

ICC Cricket World Cup 2019 : Brathwaite Fined For Breaching ICC Code Of Conduct Against India
ICC World Cup 2019: Brathwaite fined for breaching ICC Code of Conduct against India

హైదరాబాద్: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్‌కు ఐసీసీ జరిమానా విధించింది. ప్రపంచకప్‌లో భాగంగా గురువారం వెస్టిండిస్-టీమిండియా జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో కార్లోస్ బ్రాత్‌వైట్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు.

ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 నిబంధనను అతిక్రమించినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో పాటు అతడి ఖాతాలో ఒక డీమెరీట్ పాయింట్ కూడా ఐసీసీ జత చేసింది. ప్రస్తుతం బ్రాత్‌వైట్ ఖాతాలో రెండు డీమెరీట్ పాయింట్లు ఉన్నాయి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

భారత ఇన్నింగ్స్ 42వ ఓవర్‌లో తాను వేసిన బంతిని అంపైర్ వైడ్ ఇవ్వడంతో అంఫైర్‌తో వాగ్వాదానికి దిగాడు. మ్యాచ్ అనంతరం మ్యాచ్ రిఫ‌రీ క్రిస్‌ బ్రాడ్ ముందు బ్రాత్‌వైట్ తన తప్పును అంగీకరించడంతో ఐసీసీ అతనిపై జరిమానా విధించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా విరాట్ కోహ్లీ 82 బంతుల్లో 72(8ఫోర్లు), ధోని 61 బంతుల్లో 56(3 పోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీలతో చెలరేగగా... చివర్లో హార్ధిక్ పాండ్యా 38 బంతుల్లో 46(5 ఫోర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది.

అనంతరం టీమిండియా నిర్దేశించిన 269 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ జట్టు 34.2 ఓవర్లలో 143 పరుగులకే కుప్పకూలింది. ప్రపంచకప్‌లో వెస్టిండిస్‌ ఇది మూడో అతి పెద్ద ఓటమి కావడం విశేషం. భారత బౌలర్లు మహ్మద్ షమీ, బుమ్రా, చాహల్ బౌలింగ్‌‌ ముందు కరీబియన్లు నిలవలేకపోయారు.

1
43677

ఏ దశలోనూ కోహ్లీసేనకు పోటీ ఇవ్వలేకపోయారు. విండీస్ ఆటగాళ్లలో ఓపెనర్ సునీల్ ఆంబ్రిస్(31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్(28), హెట్‌మెయిర్(18) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

{headtohead_cricket_3_8}

భారత బౌలర్లలో షమీ నాలుగు... బుమ్రా, చాహల్ చెరో రెండు వికెట్లు, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా కోహ్లీ నిలిచాడు. తాజా విజయంతో టీమిండియా సెమీస్‌కు చేరుకోగా, విండీస్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. తాజా విజయంతో భారత్ 11 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.

Story first published: Friday, June 28, 2019, 19:38 [IST]
Other articles published on Jun 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X