విరాట్ కోహ్లీ
మోడ్రన్ క్రికెట్ ఎరాలో టాప్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. వన్డేల్లో కోహ్లీ ప్రస్తుతం 11,000 పరుగులకు చేరువయ్యాడు. కోహ్లీ గత 50 వన్డే ఇన్నింగ్స్లో 3151 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ ప్రత్యేకత ఏంటంటే ప్రత్యర్ధి జట్టులోని బౌలర్ గమనాన్ని ముందుగానే అంచనా వేసి కష్టతర షాట్లను కూడా ఈజీగా ఆడేస్తుంటాడు. ఈ వరల్డ్కప్లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డుని సైతం సొంతం ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉన్నాడు.
ఆండ్రీ రస్సెల్
ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న 12వ ఎడిషన్ వన్డే వరల్డ్కప్లో వెస్టిండిస్ జట్టు తరుపున ఆండ్రీ రస్సెల్ ట్రంప్ కార్డుగా బరిలోకి దిగుతున్నాడు. ఏ స్థానంలోనైనా చెలరేగి ఆడగల సత్తా ఉన్న ఆటగాడు. ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించగల ఆటగాడు. ఒత్తిడి నెలకొన్న సమయాల్లో కూడా అలవోకగా సిక్సులు బాదగలడు. ఇక, బౌలింగ్ విషయానికి వస్తే తన బౌన్సింగ్తో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్మెన్కు చుక్కలు చూపించగలడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 12వ సీజన్లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ సీజన్లో రస్సెల్ కేకేఆర్ తరుపున 204.81 స్ట్రయిక్ రేట్తో 510 పరుగులు చేశాడు. ఇందులో 52 సిక్సులు ఉన్నాయి.
డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ ఓపెనర్గా ఈ వరల్డ్కప్లో అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 12వ సీజన్లో వార్నర్ 69.20 యావరేజితో 692 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా ఒత్తిడికి లోనుకోకుండా జట్టుని విజయతీరాలకు చేర్చడంలో వార్నర్ది అందవేసిన చేయి. ఆరంభంలో చెలరేగాడంటే వార్నర్ను ఔట్ చేయడం చాలా కష్టం. ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. ఈ మెగా టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డుని సైతం సొంతం చేసుకున్న ఆటగాళ్లలో వార్నర్ కూడా ఒకడు.