హైదరాబాద్: ప్రపంచకప్లో భాగంగా తొలి సెమీస్కు సర్వం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్తో తొలి సెమీస్లో తలపడుతుంది. మంగళవారం జరగనున్న ఈ మ్యాచ్కి ఓల్ట్ ట్రాఫోర్డ్ ఆతిథ్యమిస్తోంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఒక్క ఇంగ్లాండ్ తప్పించి లీగ్ స్టేజిలో ఆడిన ప్రతి జట్టుపై కోహ్లీసేన విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 31 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. ఇక, న్యూజిలాండ్తో జరగాల్సిన మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా రద్దు అయింది.
టోర్నీలో భాగంగా లీగ్ స్టేజిలో ఏ న్యూజిలాండ్తో అయితే మ్యాచ్ ఆడలేదో అదే జట్టుతో ఇప్పుడు కోహ్లీసేన తొలి సెమీఫైనల్లో తలపడుతుండటం విశేషం. లీగ్ స్టేజిలో న్యూజిలాండ్ ఆడిన గత మూడు మ్యాచ్ల్లోనూ ఓడింది. మరోవైపు కోహ్లీసేన వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి లీగ్ స్టేజిని ఘనంగా ముగించింది.దీంతో ఈ మ్యాచ్లో టీమిండియానే ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ విశేషాలు మీకోసం...
{photo-feature}