హైదరాబాద్: కరేబియన్ దీవుల్లో జరుగుతున్న మహిళల వరల్డ్ టీ20లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై విజయం సాధించగా.. రెండో మ్యాచ్లో దాయాది పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించింది. టోర్నీలో భాగంగా గురువారం హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు పసికూన ఐర్లాండ్తో తలపడనుంది.
మ్యాచ్ గెలిస్తే.. సెమీస్కే.. హర్మన్ మరోసారి రెచ్చిపోతే!!
ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే భారత్ సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంటుంది. న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సెంచరీతో చెలరేగగా... పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో మిథాలీ రాజ్ హాఫ్ సెంచరీ సాధించింది. మరోవైపు రెండు మ్యాచ్ల్లో ఓటములు ఎదుర్కొన్న ఐర్లాండ్ జట్టు ఈ మ్యాచ్లో కనీసం పోటీనివ్వాలనే పట్టుదలతో కనిపిస్తోంది.
ప్రస్తుతం గ్రూపు-బిలో ఆస్ట్రేలియా 6 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంటే భారత్ 4 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక, ఐర్లాండ్ పాయింట్ల ఖాతా తెరువకుండానే ఐదో స్థానంలో ఉంది. అయితే పోరాటానికి మారుపేరైన ఐర్లాండ్ను తక్కువ అంచనా వేస్తే ఈ మ్యాచ్లో భారత్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
ఐర్లాండ్ Vs ఇండియా - ఎప్పుడు?
నవంబర్ 15(గురువారం)
ఐర్లాండ్ Vs ఇండియా - ఎక్కడ?
గుయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో
ఐర్లాండ్ Vs ఇండియా - ఎన్ని గంటలకు?
భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు
ఏయే టీవీ ఛానెల్స్లో ఐర్లాండ్ Vs ఇండియా మ్యాచ్ ప్రసారం
స్టార్ స్పోర్ట్ నెట్ వర్క్
ఆన్లైన్ స్ట్రీమింగ్
హాట్ స్టార్లో
భారత జట్టు:
హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, మిథాలీ రాజ్, జెమీమా రోడ్రిగ్స్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, తానియా భాటియా, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, అనుజా పాటిల్, ఏక్తా బిష్ఠ్, హేమలత, మాన్సి జోషి, పూజా వస్త్రకార్, అరుంధంతీ రెడ్డి.