హైదరాబాద్: ఐసీసీ మహిళల వరల్డ్ కప్ అఫీసియల్ బ్రాండ్ అంబాసిడర్గా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ను ఎంపిక చేసినట్లు ఐసీసీ తన అధికారిక ట్విట్టర్లో పేర్కొంది. మార్చి 8 (అంతర్జాతీయ మహిళా దినోత్సవం)ను పురస్కరించుకుని క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ మైదానంలో మహిళల వరల్డ్ కప్ 2017 షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది.
ఈ సందర్భంగా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ మీడియాతో మాట్లాడారు. మహిళల వరల్డ్ కప్ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేయడానికి మార్చి 8 సరైన రోజని భావించామని ఆయన అన్నారు.

అదే విధంగా బుధవారం (మార్చి 8) మధ్యాహ్నం నుంచి గ్రూప్ స్టేజీ మ్యాచ్ టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే మహిళల వరల్డ్ కప్ టోర్నీ జూన్ 24 నుంచి జులై 23 వరకు జరగనుంది. 21 రోజుల్లో 28 మ్యాచ్లను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

జులై 23న క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టోర్నీలో భాగంగా జూన్ 24న డెర్బీ వేదికగా భారత మహిళల జట్టు ఇంగ్లాండ్తో తలపడనుంది. బ్రిస్టల్ వేదికగా
న్యూజిలాండ్తో శ్రీలంక తలపడనుంది.