
ప్రపంచకప్ @ 90 లక్షలు:
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) మైదానంలో జరిగిన ఈ మ్యాచ్కు రికార్డు స్థాయిలో 86,174 మంది హాజరవ్వగా.. భారత్లో ఈ మ్యాచ్ను టీవీల ద్వారా చూసేందుకు 178 కోట్ల నిమిషాల సమయం వెచ్చించినట్లు ఐసీసీ తెలిపింది. ఇక టోర్నీలో హర్మన్సేన అదరగొట్టడంతో భారత్లో మొత్తంగా 540 కోట్ల నిమిషాల పాటు వీక్షించినట్టు ప్రకటించింది. డిజిటల్ ఫ్లాట్ఫామ్ వేదికగానూ ఈ టోర్నీ రికార్డు సృష్టించింది. 2019 పురుషుల ప్రపంచకప్ తర్వాత డిజిటల్ వేదికలపై అత్యంత ఆదరణ పొందిన రెండో టోర్నీగా నిలిచింది. ఇక ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు జరిగిన టోర్నీ మ్యాచ్ల వీడియోలను వంద కోట్ల మందికి పైగా వీక్షించినట్టు చెప్పింది.

ఎంసీజీకి 86,174 మంది ప్రేక్షకులు:
మెల్బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా ఏకంగా 86,174 మంది ప్రేక్షకులు ఎంసీజీకి తరలివచ్చారు. దీంతో అత్యధిక వీక్షకులు వచ్చిన మహిళల క్రికెట్ మ్యాచ్గా భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇక ఆసీస్లో జరిగిన ఓ మహిళల ఈవెంట్స్కు అత్యధిక వీక్షకులు హాజరైన పోటీ కూడా ఇదే.

85 పరుగుల తేడాతో భారత్ ఓటమి:
ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. ఓపెనర్లు ఎలీసా హేలీ (39 బంతుల్లో 75; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), బెత్ మూనీ (54 బంతుల్లో 78 నాటౌట్; 10 ఫోర్లు) చితకొట్టారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ (1/30) పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. మరో స్పిన్నర్ దీప్తి శర్మ (2/38) ఫర్వాలేదనిపించింది. అనంతరం లక్ష్య ఛేధనలో భారత్ 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. దీప్తి శర్మ (33; 2 ఫోర్లు) టాప్ స్కారర్. ఆసీస్ బౌలర్లలో షుట్ (4/18), జొనాసెన్ (3/20) రాణించారు. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో 85 పరుగుల తేడాతో ఓడి కప్ని చేజార్చుకుంది.

హర్మన్సేన చెత్త రికార్డు:
మహిళా టీ20 ప్రపంచకప్లో హర్మన్సేన ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. మెగాటోర్నీలో అత్యధిక క్యాచులు జారవిడిచిన జట్టుగా బంగ్లాదేశ్తో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. టోర్నీ మొత్తంలో భారత మహిళలు 9 క్యాచ్లు నేలపాలు చేసారు. మరోవైపు బంగ్లాదేశ్ కూడా అన్నే క్యాచ్లు జారవిడిచింది. 'క్యాచులే మ్యాచులు గెలిపిస్తాయి' అన్న క్రికెట్ సూత్రాన్ని ఈ రెండు జట్లు మరిచిపోయినట్టున్నాయి.


Click it and Unblock the Notifications












