10 ఓవర్లకు ఇంగ్లాండ్
నిజానికి ఈ మ్యాచ్లో 10 ఓవర్లకు ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 47 పరుగులు చేసింది. రన్రేట్ 4.7గా ఉంది. ఓపెనర్లు బెయిర్స్టో (25), జేసన్ రాయ్ (20) నెమ్మదిగా ఆడుతున్నారు. వికెట్ పడకపోయినా మ్యాచ్పై భారత బౌలర్ల తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో దొరికిన సువర్ణావకాశాన్ని భారత్ చేజారింది.
మ్యాచ్ను మలుపు తిప్పిన సంఘటన అదే
మ్యాచ్ను మలుపు తిప్పిన ఓ సంఘటన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో చోటుచేసుకుంది. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్ ఐదో బంతిని జేసన్ రాయ్ వికెట్ల ముందు కొచ్చి పుల్ చేశాడు. బంతి గ్లోవ్స్ను తాకుతూ వికెట్ కీపర్ ధోని చేతుల్లోకి వెళ్లింది. టీమిండియా ఆటగాళ్లు అప్పీల్ చేసినా ఫీల్డ్ అంపైర్ అలీమ్ ధార్ వైడ్ ఇచ్చాడు.
రివ్యూ కోరేందుకు సిద్ధమైన ధోని
ఈ సమయంలో కెప్టెన్ కోహ్లీ రివ్యూ కోరేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ ధోనీ అభిప్రాయం అడగ్గా అతడు నమ్మకంగా చెప్పకపోవడంతో కోహ్లీ రివ్యూని కోరలేదు. అయితే, రీప్లేలో బంతి అతడి గ్లోవ్స్కు తగిలినట్లు స్పష్టంగా కనిపించింది. ఒకవేళ కోహ్లీ గనుక రివ్యూ కోరి ఉంటే జేసన్ రాయ్ ఔటై ఉండేవాడు.
ఇంగ్లాండ్ ఒత్తిడిలోకి వెళ్లేది
ఇంగ్లాండ్ ఒత్తిడిలోకి వెళ్లేది. ఆ తర్వాత తనకు అందివచ్చిన అవకాశాన్ని జేసన్ రాయ్ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. ఆ తర్వాత జేసన్ రాయ్ దూకుడుగా ఆడటంతో పాటు బెయిర్ స్టోకు మద్దతుగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి పరుగుల వరద పారించారు. ఆ తర్వాత కుల్దీప్ బౌలింగ్లో జేసన్ రాయ్ (66) హాఫ్ సెంచరీ అనంతరం ఔటయ్యాడు.
338 పరుగుల విజయ లక్ష్యంతో
ఈ మ్యాచ్లో 338 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో లియాం ప్లెంకెట్ మూడు వికెట్లు తీయగా... క్రిస్ వోక్స్ రెండు వికెట్లు తీశాడు. తాజా విజయంతో ఇంగ్లాండ్ తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. చివరి మ్యాచ్లో న్యూజిలాండ్తో గెలిస్తే ఇంగ్లాండ్ సెమీస్కు చేరుతుంది.
ఐదు వికెట్లు తీసిన షమీ
ఇక, ఈ మెగా టోర్నీలో కోహ్లీసేన ఇంకా బంగ్లాదేశ్, శ్రీలంకతో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా భారత్ సెమీస్కు వెళ్తుంది. అంతకముందు జానీ బెయిర్ స్టో(111) సెంచరీ సాధించగా బెన్ స్టోక్స్(79), జేసన్ రాయ్(66) హాఫ్ సెంచరీలతో మెరవగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లతో మరోసారి సత్తాచాటగా... బుమ్రా, కుల్దీప్లు తలో వికెట్ తీశారు.