|
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 90 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో సెంచరీని నమోదు చేశాడు. ఈ ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఇది నాలుగో సెంచరీ కాగా... మొత్తంగా 26వ సెంచరీ కావడం విశేషం. తద్వారా ప్రపంచకప్లో అత్యధిక సెంచరీలు సాధించిన శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కర(4 సెంచరీలు) రికార్డుని రోహిత్ శర్మ సమం చేశాడు.
|
500 పరుగుల మైలురాయిని అందుకున్న రోహిత్
ప్రస్తుత ప్రపంచకప్లో రోహిత్ శర్మ ఇప్పటికే 500 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మెగా టోర్నీలో ఇప్పటికే దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లాండ్లపై సెంచరీలు సాధించాడు. ఇప్పుడు బంగ్లాపై సెంచరీతో చెలరేగాడు. షకీబ్ వేసిన 29వ ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. సెంచరీ అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో రోహిత్ శర్మ 92 బంతుల్లో 104(7 ఫోర్లు, 5 సిక్సులు) సౌమ్య సర్కార్ బౌలింగ్లో లిట్టన్ దాస్కు క్యాచ్ ఇచ్చాడు.
|
తొలి వికెట్కు 180 పరుగులు
దీంతో జట్టు స్కోరు 180 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(26: 27 బంతుల్లో 3ఫోర్లు) ఈ మ్యాచ్లో తక్కువ పరుగులకే పెవిలియన్కు చేరి నిరాశపరిచాడు. ముస్తాఫిజుర్ వేసిన 39వ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి డీప్ స్కేర్లెగ్లో రుబెల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.
|
హార్దిక్ పాండ్యా డకౌట్
అనంతరం క్రీజులోకి వచ్చిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా(0) కూడా ఎదుర్కొన్న రెండో బంతికే స్లిప్లో సౌమ్య సర్కార్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ధోనీ, పంత్లు కలిసి జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జట్టు స్కోరు 277 పరుగుల వద్ద రిషబ్ పంత్(48) షకీబ్ ఉల్ హాసన్ బౌలింగ్లో హుస్సేన్కు క్యాచ్ ఇవ్వడంతో తృటిలో హాఫ్ సెంచరీని మిస్సయ్యాడు.
|
పంత్ ఔటైన తర్వాత స్కోరు బోర్డులో తగ్గిన వేగం
రిషబ్ పంత్ ఔటైన తర్వాత టీమిండియా స్కోరు బోర్డులో వేగం తగ్గింది. ధోని దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆఖరి ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి 35 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్లో షకీబ్ ఉల్ హాసన్కు క్యాచ్ ఇచ్చాడు. చివర్లో భువనేశ్వర్ రనౌట్ కాగా, ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి షమీ బౌల్డయ్యాడు.
|
5 వికెట్లు తీసిన ముస్తాఫిజుర్ రెహ్మాన్
దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ 5 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేయగా... షకీబ్ ఉల్ హాసన్, రుబెల్ హుస్సేన్, సౌమ్య సర్కార్ తలో వికెట్ తీసుకున్నారు.