
హైదరాబాద్: పొరుగు దేశమైన బంగ్లాదేశ్తో అండర్-19 భారత జట్టు తలపడనుంది. క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్న ఇరుజట్లు హోరాహోరీగా ఈ సమరంలో తమ సత్తా నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాయి. శనివారం జరిగిన గ్రూప్-సి మ్యాచ్లో ఇంగ్లాండ్ 282 పరుగుల తేడాతో కెనడాను చిత్తు చేయడంలో బంగ్లా క్వార్టర్స్కు అర్హత సాధించింది.
కెనడాతో మ్యాచ్లో మొదట ఇంగ్లాండ్ 7 వికెట్లకు 383 పరుగులు సాధించింది. లియామ్ బ్యాంక్స్ (120), జాక్స్ (102) శతకాలు బాదారు. ఛేదనలో కెనడా 31.4 ఓవర్లలో 101 పరుగులే ఆలౌటైంది. సిసోడియా మూడు వికెట్లు పడగొట్టాడు. మరో మ్యాచ్ (గ్రూప్-ఎ)లో న్యూజిలాండ్ 71 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి గ్రూప్లో అగ్రస్థానం సాధించింది.
ఇంకో పక్క అఫ్ఘనిస్థాన్ జట్టుతో పాకిస్థాన్ తలపడగా ఐదు వికెట్ల నష్టంతో పాకిస్థాన్ జట్టు ఓడిపోయింది. అయినప్పటి అత్యధిక రన్ రేటును పాకిస్థాన్ కలిగి ఉంది. ఈ నెల 26న జరగనున్న భారత్, బంగ్లాదేశ్ మధ్య క్వార్టర్ఫైనల్ న్యూజిలాండ్ వేదికగా జరగనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.