ప్రతీ బంతిని టీవీ అంపైర్ పరిశీలిస్తాడు:
ఆస్ట్రేలియాలో జరిగే మహిళల టీ20 ప్రపంచకప్లో ఫ్రంట్ ఫుట్ నోబాల్ను థర్డ్ అంపైర్ పర్యవేక్షిస్తాడని ఐసీసీ మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. 'ప్రతీ బంతిని టీవీ అంపైర్ (థర్డ్ అంపైర్) పరిశీలిస్తాడు. నోబాల్ అయితే వెంటనే ఫీల్డ్ అంపైర్కు సమాచారం అందిస్తాడు. ఫ్రంట్ ఫుట్ నోబాల్ విషయంలో ఫీల్డ్ అంపైర్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించాం' అని క్రికెట్ ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అలార్డైస్ పేర్కొన్నారు.
13 నోబాల్స్ గుర్తింపు:
గతేడాది చివరలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్లలో థర్డ్ అంపైర్కు ప్రయోగాత్మకంగా నోబాల్స్ బాధ్యతను అప్పగించి పరిశీలించిన ఐసీసీ.. మహిళల మెగా టోర్నీలో పూర్తిస్థాయిలో థర్డ్ అంపైర్కే నిర్ణయాధికారం వదిలేసింది. ఇటీవల జరిగిన 12 మ్యాచ్ల్లో బౌలర్లు 4,717 బంతులు సంధించగా.. గీత దాటిన 13 నోబాల్లను థర్డ్ అంపైర్ గుర్తించారు. ఇందులో కచ్చితమైన నిర్ణయాలు రావడంతో ఐసీసీ మెగా ఈవెంట్లో థర్డ్ అంపైర్కే ఆ బాధ్యతలు అప్పజెప్పింది.
2016లోనే మొదలు:
2016లో ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన సిరీస్లో దీన్ని అమలు చేసినా.. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా నిలిపివేసారు. అయితే మరోసారి ఈ పద్దతిని భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్లలో ప్రయోగించింది. ఐసీసీ నిర్ణయంతో అన్ఫీల్డ్ అంపైర్ల పని మరింత సులువయింది. ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్ ఈ నెల 21న మొదలవుతుంది. సిడ్నీలో జరిగే తొలి మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడతాయి.