
8 ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ 544 పరుగులు
ఈ సిరీస్లో 8 ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ 544 పరుగులు చేశాడు. తద్వారా కోహ్లీ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లీషు గడ్డపై అత్యధిక పరుగులు (544) చేసిన భారత కెప్టెన్గా కోహ్లీ నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ (2006లో విండీస్పై 496) పేరిట ఉంది.

ఆరో స్థానంలో పుజారా
ఇక, ర్యాంకింగ్స్లో పుజారా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 132 పరుగులతో నాటౌట్గా నిలవడంతో తన 763 పాయింట్లను 798కి పెంచుకున్నాడు. బౌలర్ల జాబితాలో పేసర్ షమీ మూడు స్థానాలు ఎగబాకి 19వ ర్యాంకులో, ఇషాంత్ శర్మ ఒక ర్యాంకు మెరుగై 25వ స్థానంలో ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా 487 పాయింట్లతో 37వ ర్యాంకులో ఉన్నాడు.

నాలుగో టెస్టులో 60 పరుగుల తేడాతో ఓటమి
సౌతాంప్టన్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 60 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 245 పరుగుల లక్ష్య ఛేదనలో హాఫ్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లి (58) వేగవంతంగా 4వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి కెప్టెన్గా నిలిచాడు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో భాగంగా నాల్గో టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డు నెలకొల్పాడు.

కెప్టెన్గా మరో మైలురాయిని
ఆ సిరీస్ ద్వారా ఇప్పటికే టెస్టుల్లో వేగవంతంగా ఆరువేల పరుగుల మైలురాయిని అందుకుని రెండో భారత క్రికెటర్గా నిలిచిన కోహ్లి.. కెప్టెన్గా మరో మైలురాయిని కూడా అందుకున్నాడు. ఇప్పటివరకూ ఈ రికార్డు బ్రియాన్ లారా పేరిట ఉండగా దాన్ని కోహ్లి సవరించాడు. లారా కెప్టెన్గా 40 టెస్టుల్లో 4 వేల పరుగులు చేయగా, కోహ్లి 39 టెస్టు మ్యాచ్ల్లోనే ఆ రికార్డు సాధించాడు.


Click it and Unblock the Notifications












